Mukesh Ambani | కన్నీళ్లు పెట్టుకున్న అపర కుబేరుడు.. ఎంతైనా తండ్రి కదా..

-

అపర కుబేరుడు ముఖేశ్ అంబానీ(Mukesh Ambani) కుమారుడు అనంత్, రాధికా మర్చంట్‌ల ప్రీ వెడ్డింగ్ వేడుకలు గుజరాత్‌లోని జామ్ నగర్‌లో ఓ రేంజ్‌లో జరుగుతున్నాయి. దాదాపు రూ.1000కోట్లతో ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. మూడు రోజుల పాటు సాగనున్న ఈ వేడుకల్లో దేశ, విదేశాల నుంచి అతిరథ మహారథులు తరలివచ్చారు. తొలిరోజు వేడుకల్లో అనంత్ అంబానీ ఉద్వేగంతో ప్రసంగించారు.

- Advertisement -

“నా జీవితం పూల పాన్పు కాదని మీ అందరికీ తెలుసు. బాల్యం నుంచి అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నాను. జీవిత ప్రస్థానంలో అనేక ఎదురుదెబ్బలు తగిలాయి. అయితే ఆ బాధను మర్చిపోయేలా చేసేందుకు నా తల్లిదండ్రులు ఎంతో శ్రమించారు, నాకు ఎల్లప్పుడూ అండగా నిలిచారు. నా లక్ష్య సాధనలో అనుక్షణం ప్రోత్సహించారు.. వారికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. ఇప్పుడు ఈ పెళ్లి వేడుకలను మరింత చిరస్మరణీయం చేసేందుకు తన ఫ్యామిలీ ఎంతో కష్టపడింది. నన్ను సంతోషంగా ఉంచడానికి మా అమ్మ ఎంతో తపించిపోయారు.

ఈ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ ను ఓ తీపి గుర్తుగా మలచేందుకు మా కుటుంబం గత రెండు నెలలుగా రోజుకు 3 గంటలే నిద్రపోయింది” అని అనంత్(Anant Ambani) తెలిపారు. ఆయన మాటలకు ముఖేశ్ అంబానీ(Mukesh Ambani) తీవ్ర భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read Also: ఉపాసన కాళ్లకు మసాజ్ చేసిన రామ్‌చరణ్.. వీడియో వైరల్..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

పెళ్ళై పిల్లలున్న వ్యక్తితో డేటింగ్‌పై సాయిపల్లవి క్లారిటీ

సాయి పల్లవి(Sai Pallavi) ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. నేచురల్ బ్యూటీగా...

అసెంబ్లీలో వాళ్లందర్నీ నిలబెట్టిన సీఎం..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ఈరోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని...