Mukesh Ambani | కన్నీళ్లు పెట్టుకున్న అపర కుబేరుడు.. ఎంతైనా తండ్రి కదా..

-

అపర కుబేరుడు ముఖేశ్ అంబానీ(Mukesh Ambani) కుమారుడు అనంత్, రాధికా మర్చంట్‌ల ప్రీ వెడ్డింగ్ వేడుకలు గుజరాత్‌లోని జామ్ నగర్‌లో ఓ రేంజ్‌లో జరుగుతున్నాయి. దాదాపు రూ.1000కోట్లతో ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. మూడు రోజుల పాటు సాగనున్న ఈ వేడుకల్లో దేశ, విదేశాల నుంచి అతిరథ మహారథులు తరలివచ్చారు. తొలిరోజు వేడుకల్లో అనంత్ అంబానీ ఉద్వేగంతో ప్రసంగించారు.

- Advertisement -

“నా జీవితం పూల పాన్పు కాదని మీ అందరికీ తెలుసు. బాల్యం నుంచి అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నాను. జీవిత ప్రస్థానంలో అనేక ఎదురుదెబ్బలు తగిలాయి. అయితే ఆ బాధను మర్చిపోయేలా చేసేందుకు నా తల్లిదండ్రులు ఎంతో శ్రమించారు, నాకు ఎల్లప్పుడూ అండగా నిలిచారు. నా లక్ష్య సాధనలో అనుక్షణం ప్రోత్సహించారు.. వారికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. ఇప్పుడు ఈ పెళ్లి వేడుకలను మరింత చిరస్మరణీయం చేసేందుకు తన ఫ్యామిలీ ఎంతో కష్టపడింది. నన్ను సంతోషంగా ఉంచడానికి మా అమ్మ ఎంతో తపించిపోయారు.

ఈ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ ను ఓ తీపి గుర్తుగా మలచేందుకు మా కుటుంబం గత రెండు నెలలుగా రోజుకు 3 గంటలే నిద్రపోయింది” అని అనంత్(Anant Ambani) తెలిపారు. ఆయన మాటలకు ముఖేశ్ అంబానీ(Mukesh Ambani) తీవ్ర భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read Also: ఉపాసన కాళ్లకు మసాజ్ చేసిన రామ్‌చరణ్.. వీడియో వైరల్..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సీఎం రేవంత్, కేటీఆర్‌ల మధ్య చీర పంచాయితీ

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం ఊపందుకుంది....

Ambati Rambabu | మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు తీవ్ర ఆరోపణలు..

ఎన్నికల వేళ ఏపీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu)కు భారీ షాక్...