Piyush Goyal:నన్నే అనండి.. నా ఉద్ద్యేశం అదికాదు

-

Piyush Goyal Withdraws Demeaning Remark on Bihar: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ బీహార్ పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. బీహార్ ని కానీ, బీహార్ ప్రజలను కానీ అవమానపరిచే ఉద్దేశ్యం తనకు లేదని అన్నారు. తన మాటలు ఎవరినైనా బాధిస్తే తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు.

- Advertisement -

మంగళవారం ఆర్జేడి ఎంపీ మనోజ్ ఝా రాజ్యసభలో ద్రవ్యోల్బణం, ఆర్థిక పరిస్థితులపై మాట్లాడుతుండగా.. పీయూష్ గోయల్(Piyush Goyal) కలుగజేసుకొని..వారి ఇలానే ఉంటె దేశం మొత్తాన్ని బీహార్ మారుస్తాడంటూ వ్యాఖ్యానించారు. వెంటనే స్పందించిన ఎంపీ మనోజ్ ఝా సర్ మీరు బీహార్ ని అవమానపరుస్తున్నారని అన్నారు. మీరు ఏమైనా అనాలనుకుంటే నన్ను అనండి కానీ, బీహార్ ను ఏం అనొద్దంటూ వేడుకున్నారు.

గత రెండు రోజులుగా బీహార్ ఎంపీలు, ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంట్ లోని గాంధీ విగ్రహం వద్ద నిరసనలు చేస్తూ.. మంత్రి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసారు. అలాగే బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్విని యాదవ్ ఘాటుగా రిప్లై ఇచ్చారు. తన సొంత రాష్ట్రమైన మహారాష్ట్రం నుండి 2.5 కోట్ల విలువైన ప్రాజెక్టులను గుజరాత్ కు తరలించుకోపోతే ఏమి చేయలేని తెలివి తక్కువ, అహంకారి మంత్రి అంటూ విమర్శించారు.

Read Also: భోజనానికి ముందు, తర్వాత పొరపాటున కూడా ఇలా చేయకండి

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సీఎం రేవంత్, కేటీఆర్‌ల మధ్య చీర పంచాయితీ

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం ఊపందుకుంది....

Ambati Rambabu | మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు తీవ్ర ఆరోపణలు..

ఎన్నికల వేళ ఏపీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu)కు భారీ షాక్...