ఆదిత్య ఎల్‌-1 సక్సెస్.. ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ హర్షం

-

సూర్యుడిపై అధ్యయనానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ప్రవేశపెట్టిన ఆదిత్య ఎల్‌-1(Aditya L1) నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. శనివారం ఉదయం 11.50 గంటలకు ఈ ప్రయోగం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో ఉన్న సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ ఇందుకు వేదిక అయింది. ఆదిత్య ఎల్‌-1 శాటిలైట్‌ను మోసుకుంటూ పీఎస్‌ఎల్వీ-సీ57 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. కాగా, ఆదిత్య ఎల్-1 ప్రయోగం గ్రాండ్ సక్సెస్ కావడంతో ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. శాస్త్రవేత్తల నిరంతర కృషి ఫలితమే ఈ విజయమని వారు హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో అంతరిక్ష పరిశోధనా రంగంలో మరో కీలక మైలురాయి అని అన్నారు.

Read Also: జమిలీ ఎన్నికల కమిటీ ప్రకటన.. చైర్మన్‌గా మాజీ రాష్ట్రపతి
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Sathya Sai District | ఏపీలో ఒకే ఫ్యామిలీలో నలుగురు మృతి… సైనైడ్ కారణమా?

ఏపీ శ్రీ సత్యసాయి జిల్లాలో(Sathya Sai District) దారుణ ఘటన చోటు...

HCU Land Dispute | ‘భూమి బదిలీకి HCU అంగీకరించలేదు’

HCU Land Dispute | హైదరాబాద్ విశ్వవిద్యాలయం (HCU) సోమవారం 2024...