PM Modi | విపక్షాల ‘ఇండియా’ కూటమిపై ప్రధాని సంచలన వ్యాఖ్యలు

-

ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) ప్రతిపక్షాల తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండియా కూటమి(Opposition Front INDIA)పై నిప్పులు చెరిగారు. కూటమి పేరులో ఇండియా ఉంటే సరిపోదన్నారు. ఈస్ట్ ఇండియా కంపెనీ పేరులో, ఇండియన్ ముజాహిద్దీన్, పీఎఫ్ఐ పేర్లలో కూడా ఇండియా ఉందని గుర్తు చేశారు. మంగళవారం బీజేపీ ఎంపీలతో సమావేశం అయిన ప్రధాని పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు విపక్షాలు అంతరాయం కలిగిస్తున్నాయని ధ్వజమెత్తారు.

- Advertisement -

ఇటువంటి దిక్కులేని ప్రతిపక్షాన్ని ఎన్నడూ చూడలేదని ఘాటు విమర్శలు గుప్పించారు. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి దేశం పేరను ఉపయోగించడం సరిపోదని దుయ్యబట్టారు. ప్రతిపక్షాలు నిరాశ, నిస్పృహలోనే కొనసాగాలని నిర్ణయించుకుంటున్నాయని ఆ పార్టీల ప్రవర్తనను చూస్తే అర్థం అవుతోందన్నారు. 2024 ఎన్నికల్లోనూ ప్రజల మద్దతు బీజేపీకే ఉందని తమ ప్రభుత్వ హయాంలో భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ప్రధాని మోడీ(PM Modi) విశ్వాసం వ్యక్తం చేశారు.

Read Also: తెలంగాణ హై కోర్టు సంచలన తీర్పు.. BRS ఎమ్మెల్యేపై అనర్హత వేటు
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

పరీక్ష విధానంలో మార్పులు.. ఎప్పటినుంచో చెప్పిన మంత్రి లోకేష్

విద్యాశాఖపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై...

జానీ మాస్టర్‌పై కేసు నమోదు.. లైగింకా వేధించాడంటూ ఫిర్యాదు..

ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌(Jani Master)పై లైంగిక వేధింపుల కేసు...