Heeraben Modi: ప్రధాని మోడీ తల్లి మృతి.. ముగిసిన అంత్యక్రియలు

-

PM Modi’s Mother Heeraben Modi Passes Away at 100: ప్రధాని మోడీకి తల్లి హీరాబెన్(100) కన్నుమూశారు. రెండు రోజుల క్రితం అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను అహ్మదాబాద్లోని యుఎన్ మెహతా ఆస్పత్రిలో జాయిన్ చేశారు. అక్కడ చికిత్స పొందుతున్న హీరాబెన్ ఆరోగ్యం విషమించడంతో గురువారం అర్థరాత్రి కన్నుమూశారు. కొద్దిసేపటి క్రితం గాంధీ నగర్ లో హీరాబెన్ అంత్యక్రియలు ముగిశాయి. ప్రధాని మోడీ తల్లి చితికి నిప్పంటించారు. తల్లి అంత్యక్రియలకు అన్నీ తానై వ్యవహరించారు మోడీ.

- Advertisement -

అంతకుముందు మోడీ తల్లి(Heeraben Modi) పాడె మోశారు. రేసన్ లోని తల్లి నివాసంలో మృతదేహానికి పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. కాగా తల్లి మరణంపై మోడీ భావోద్వేగ ట్వీట్ చేశారు. నిండు నూరేళ్లు పూర్తి చేసుకుని తన తల్లి ఈశ్వరుడి చెంతకు చేరిందన్నారు. ఆమె జీవితం ఒక తపస్సులాంటిదన్నారు. అమ్మ నిస్వార్థానికి చిహ్నమన్నారు. అమ్మలో త్రిమూర్తులను చూశానన్నారు. తన తల్లి కర్మయోగికి ప్రతీకలా నిలిచిందన్నారు.

Read Also: మరచిపోతున్న కళకు ప్రాణం పోస్తున్న డా. శ్రీజ సాధినేని

Read more RELATED
Recommended to you

Latest news

Must read

టీమ్ పాక్ దుస్థితికి కారణమేంటో చెప్పిన అశ్విన్

టీమ్ పాకిస్థాన్(Pakistan) కొంత కాలంగా అత్యంత పేలవమైన ప్రదర్శనతో అభిమానులు, సీనియర్ల...

బాలీవుడ్ ఎంట్రీపై సూర్య క్లారిటీ.. ఇప్పుడు చెప్పనంటూ..

బాలీవుడ్ ఎంట్రీకి కోలీవుడ్ స్టార్ సూర్య(Surya) రెడీ అయ్యారంటూ వస్తున్న వార్తలపై...