Rahul Gandhi | కాంగ్రెస్ కంచుకోటల్లో రాహుల్, ప్రియాంక పోటీపై నేడే క్లారిటీ

-

Rahul Gandhi – Priyanka Gandhi | మే 20 న అమేథీ, రాయ్ బరేలీ లలో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. రేపటితో నామినేషన్ల దాఖలుకు గడువు ముగియనుంది. దీంతో ఈ రెండు స్థానాలలో కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటనపై ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ కంచుకోటలైన అమేథీ, రాయ్ బరేలి పార్లమెంటు అభ్యర్థులపై నేడు కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ నిర్ణయం తీసుకోనుంది. ఏ క్షణంలోనైనా అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.

- Advertisement -

ఈ రెండు స్థానాల్లో పోటీకి రాహుల్ గాంధీ(Rahul Gandhi), ప్రియాంక గాంధీ సుముఖంగా ఉన్నారు. యూపీ కాంగ్రెస్ అగ్ర నాయకత్వం కూడా ఈ రెండు స్థానాల నుంచి ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ పోటీ చేయాలని డిమాండ్ చేస్తోంది. ఇక రాయ్ బరేలి లోక్ సభ స్థానం నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అమేథీ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.

Read Also: సల్మాన్ ఖాన్ కాల్పుల కేసులో భారీ ట్విస్ట్
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....

THSTI లో ప్రాజెక్ట్ రీసెర్చ్ స్టాఫ్ కి నోటిఫికేషన్

ఫరీదాబాద్ (హరియాణా)లోని ప్రభుత్వరంగ సంస్థకు చెందిన ట్రాన్టేషనల్ హెల్త్ సైన్స్ అండ్...