గుడ్ న్యూస్: రూ.2 వేల నోట్ల మార్పిడిపై SBI క్లారిటీ

-

రూ.2 వేల నోట్ల ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ(RBI) ఇటీవల ప్రకటించడంతో ఈ నోట్లను మార్చుకునే విషయంలో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రూ.2 వేల నోట్ల(2000 Rupee Notes) మార్పిడిపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) ఆదివారం కీలక అప్ డేట్ ఇచ్చింది. ఈ నోట్లను మార్చుకోవడానికి బ్యాంకుల్లో ఎలాంటి పత్రాలు నింపాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. నోట్ల మార్పిడికి ఎలాంటి గుర్తింపు పత్రాలు చూపించాల్సిన పని లేదని రూ.20 వేల వరకు బ్యాంకులో నేరుగా మార్చుకోవచ్చని పేర్కొంది. ఈ మేరకు ఇవాళ స్టేట్ బ్యాంక్ బ్రాంచీలకు మార్గదర్శకాలు విడుదల చేసింది. త్వరలో నిషేధించబోతున్న ఈ నోట్లను మార్చుకోవడానికి ఆధార్ కార్డు తో పాటు ఇతర ఫామ్స్ ను సమర్పించాలంటు సోషల్ మీడియాలో ప్రచారం  జరుగుతుండటంతో ఎస్బీఐ(SBI) ఈ క్లారిటీ ఇచ్చింది. మరో వైపు ప్రజలు 2 వేల నోట్లను రూ.20 వేల వరకు ఒక రోజులో ఎన్నిసార్లు అయినా మార్చుకోవచ్చని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

మహాసేన రాజేష్ యూటర్న్.. జనసేనను ఓడిస్తామని సంచలన వ్యాఖ్యలు..

ఏపీ ఎన్నికల వేళ అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. తాజాగా జనసేన పార్టీకి...

అంబటి రాంబాబు వ్యాఖ్యలపై అల్లుడు మరో వీడియో

ఏపీ ఎన్నికలు హాట్‌హాట్‌గా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే మంత్రి అంబటి రాంబాబు(Ambati...