రోడ్డు ప్రమాదంలో ఏడుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి

-

అస్సాంలోని గువహతి(Guwahati)లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఏడుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు దుర్మరణం చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన గువహతిలోని జలక్‌బారీ ప్రాంతంలో ఆదివారం అర్థరాత్రి 1 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అస్సాంలోని గువహతి(Guwahati)లో జలక్​బారీ ప్రాంతంలో 10 మంది ఇంజినీరింగ్ విద్యార్థులతో కలిసి వెళ్తున్న కారు వేగంగా దూసుకు వచ్చింది. దీంతో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న పికప్‌ వ్యాన్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందగా…మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం ధాటికి రెండు వాహనాలు నుజ్జునుజ్జు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులను ఇంజినీరింగ్ విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. మద్యం తాగి వాహనం నడిపారా లేక నిద్రమత్తులో ప్రమాదం జరిగిందా అని పోలీసులు ఆరా తీస్తున్నారు.

Read Also:
1. సంచలనం సృష్టించిన జ్యూవలరీ షాప్ కేసులో కీలక పరిణామం
2. ఏపీ ప్రజలకు టీడీపీ వరాల జల్లు.. అదిరిపోయిన మేనిఫెస్టో
Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సీఎం రేవంత్, కేటీఆర్‌ల మధ్య చీర పంచాయితీ

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం ఊపందుకుంది....

Ambati Rambabu | మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు తీవ్ర ఆరోపణలు..

ఎన్నికల వేళ ఏపీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu)కు భారీ షాక్...