నైజీన్‌ సరస్సులో ఎంజాయ్ చేస్తున్న సోనియా గాంధీ

-

కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ చాలా గ్యాప్ తర్వాత టూర్ లో కనిపించారు. తాజాగా శనివారం శ్రీనగర్‌లోని నైజీన్‌ సరస్సులో ఆమె బోటు షికారు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. గాంధీ ఫ్యామిలీలోని సభ్యులు శ్రీనగర్ టూర్ ను ప్లాన్ చేసుకున్నారు. రాహుల్‌ గాంధీ ఇప్పటికే శ్రీనగర్‌లో ఉన్నారు. ప్రియాంక గాంధీ, రాబర్ట్‌ వాద్రా దంపతులు కూడా శ్రీనగర్ కు చేరుకోనున్నారని తెలుస్తోంది. వీరంతా కలిసి శ్రీనగర్ నుంచి గుల్మార్గ్‌కు బయలుదేరి వెళ్తారని సమాచారం.

- Advertisement -

గత కొన్నేళ్లుగా శ్రీనగర్‌లోని ‘రైన్‌వారి’ ప్రాంతంలోని ఓ హోటల్‌లో ఏటా రెండు రాత్రులు నిద్ర చేయడం గాంధీ ఫ్యామిలీకి సెంటిమెంట్‌గా మారింది. అయితే, ఈ సారి రాహుల్‌ గాంధీ నైజీన్‌ సరస్సు సమీపంలోని బోట్‌ హౌస్‌లో ఉంటారట. మిగతా కుటుంబ సభ్యులంతా వారి సెంట్‌మెంట్‌ మేరకు పాత హోటల్‌లోనే బస చేస్తారట. అయితే ఇది కేవలం కుటుంబ పర్యటన మాత్రమేనని, ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Revanth Reddy | తెలంగాణకు బీజేపీ ‘గాడిద గుడ్డు’ ఇచ్చింది.. రేవంత్ రెడ్డి సెటైర్లు..

తెలంగాణకు పదేళ్ల మోదీ పాలనలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఏమీ లేదని...

Janasena | ఇప్పుడే నీ పేరు మార్చుకో.. ముద్రగడకు జనసేన నేత వార్నింగ్..

పిఠాపురంలో పవన్ కల్యాణ్‌ను ఓడించకపోతే తన పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకంటానంటూ ముద్రగడ...