Bilkis Bano Case | బిల్కిస్ బానో కేసులో ఆగస్టు 7న తుది విచారణ

-

2002 గుజరాత్ లో జరిగిన గోద్రా అల్లర్ల తర్వాత గర్భిణిగా ఉన్న బిల్కిస్ బానో(Bilkis Bano Case) పై జరిగిన సామూహిక అత్యాచార ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం అయింది. ఈ ఘటనలో తన కడుపులో ఉన్న బిడ్డతో సహా ఏడుగురు కుటుంబీకులను బిల్కిస్ కోల్పోయింది. కాగా, ఈ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న 11 మంది నిందితులను గుజరాత్ ప్రభుత్వం సత్ప్రవర్తన కారణంగా గతేడాది ఆగస్టు 15 న విడుదల చేసింది.

- Advertisement -

జీవిత ఖైదు అనుభవిస్తున్న నిందితులను ముందుగానే విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ బిల్కిస్ బానో(Bilkis Bano Case) సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై గత కొంతకాలంగా సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. కాగా ఈ కేసులో సోమవారం జరిగిన విచారణ అనంతరం.. తుది వాదనలు ఆగస్టు 7న వింటామని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది.

Read Also: ఎన్డీఏ సమావేశానికి హజరవనున్న 38 పార్టీలు..?
Follow us on: Instagram Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...