కేంద్ర మంత్రి కుమారస్వామికి అస్వస్థత.. ముక్కు నుంచి రక్తం..

-

కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి(Kumaraswamy) అస్వస్థతకు గురయ్యారు. మీడియాతో మాట్లాడుతుండగానే ఆయన ముక్కు నుంచి రక్తస్రావం కావడం అక్కడ అందరినీ ఆందోళనకు గురిచేసింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆయనను ఆసుపత్రికి తరలించింది. దీనికి సంబంధించిన ఫొటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి వివరాలు బయటకు రావాల్సి ఉంది. అసలు ఆయన ముక్కు నుంచి రక్తం ఎందుకు కారింది అనేది ప్రస్తుతం బెంగళూరు అంతటా హాట్ టాపిక్‌గా మారింది.

- Advertisement -

అయితే బీజేపీ, జేడీఎస్ పాదయాత్రకు సంబంధించి బెంగళూరులోని ఓ హోటల్ వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతుండగానే హెచ్‌డీ కుమారస్వామి(Kumaraswamy) ముక్కు నుంచి రక్తస్రావం కావడం మొదలైంది. వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది ఆయనను హుటాహుటిన అపోలో ఆస్పత్రికి తరలించారు. ముక్కును క్లాత్‌తో అదిమి పట్టుకుంటూ మీడియా సమావేశాన్ని కొనసాగించాలంటూ పక్కనే ఉన్న యడియూరప్పకు సైగ చేశారు కుమారస్వామి. అనంతరం కారులో ఆసుపత్రికి వెళ్లారు.

Read Also: ఇన్‌స్టా డీయాక్టివేట్‌కు అసలు కారణం చెప్పిన విశ్వక్..
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

తిరుపతి లడ్డూ తయారీ నెయ్యిలో పశువుల కొవ్వు.. సీఎం సంచలన వ్యాఖ్యలు

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం(Tirumala Prasadam) తయారీలో పశువుల కొవ్వులు కలిపారని,...

‘వైసీపీలో ఏడ్చిన రోజులు ఉన్నాయి’.. పార్టీ మార్పుపై బాలినేని క్లారిటీ..

ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి(Balineni Srinivasa Reddy).. వైసీపీకి...