కీలక పదవికి ఆ రెడ్డిగారి పైనే జగన్ ఫోకస్

కీలక పదవికి ఆ రెడ్డిగారిపైనే జగన్ ఫోకస్

0
324

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెస్ట్ సీఎంగా గుర్తింపు పొందారు… తర వందరోజుల పరిపాలనలో అభివ్రద్ది అనేది ఎలా ఉంటుందో నిరూపించారు. జగన్ చేస్తున్న అభివ్రద్ది కార్యక్రమాలు చూసి యావత్ దేశ రాజకీయనాయకులే ఆశ్చర్యపోతున్నారు…

లోటు బడ్జెట్ తో ఉన్న కొత్త రాష్ట్రాన్ని 40 సంవత్సరాల యువకుడు జగన్ చేస్తున్న కార్యక్రమాలను చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. ఎక్కడా అవినీతిలేని పాలన అందించి ప్రశంశలు అందుకుంటున్నారు. అయితే రాష్ట్రంలో అవినీతిలేని పాలన అందిస్తూనే జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ఏపీ నూతన లోకాయుక్తగా రిటైర్డ్ జస్టిస్ పీ లక్ష్మణ్ రెడ్డినినియమించాలని చూస్తున్నారట. లోకాయుక్త చట్టం ప్రాకారం రిటైర్డ్ న్యాయమూర్తిని లోకాయుక్త నియమించుకునే అవకాశం ఉంది. అందుకే జగన్ పీ లక్ష్మణ్ రెడ్డిని నియమించినట్లు తెలుస్తోంది.