Flash: విద్యార్థులకు అలెర్ట్..తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

0
49

రాబోయే రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎండల తీవ్రత దృష్యా రేపటి నుండి అనగా 31 మార్చి నుండి, ఏప్రిల్ 6వ తేదీ వరకు ఒక్కపూట బడుల సమయాన్ని మారుస్తూ (ఒక గంట సమయాన్ని కుదిస్తూ) తెలంగాణ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం పాఠశాల ఉదయం 8 గంటల నుండి 11.30 గంటల వరకు మాత్రమే నిర్వహించనున్నారు.