షర్మిల అక్కాయ్… ఆంధ్రా సిఎం కుర్చీ మీద కర్చిప్ వేసేయ్ అంటున్న టిడిపి ఫ్యాన్స్

0
93

తెలంగాణలో పార్టీ పెట్టిన వైఎస్ షర్మిల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆంధ్రా తెలుగుదేశం అభిమానులు అంచనా వేస్తున్నారు. వచ్చే వాళ్ళు తక్కువ పోయేవాళ్లే ఎక్కువ అన్నట్లు పరిస్థితి తయారైందని, ఇక తెలంగాణలో దుకాణం సర్దుకుని ఆంధ్రా సిఎం కుర్చీ మీద కర్చిప్ వేయాలి అంటూ ఆహ్వానిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు కుమ్మరిస్తున్నారు తెలుగుదేశం అభిమానులు. అలాంటిదే ఒక పోస్టు ఇది. AP with CBN అనే పేజీలో ఉంది. ఆసక్తికరంగా ఉన్న ఈ పోస్టును ఆల్ టైం రిపోర్ట్ లో దిగువన యదాతదంగా ప్రచురిస్తున్నాము.

తెలంగాణ లో శర్మిల పార్టీ అయోమయం..!వచ్చేవాళ్ళు తక్కువ పోఎ వాళ్ళు ఎక్కువ . ఎన్నో పార్టీలు వచ్చాయి కానీ ఎన్నికల పరాభవం తో జండా పీకేశాయి .. కానీ షర్మిల పార్టీ ఎన్నికలవరకు కూడా ఉండే లా లేదు . అంతర్మధనం మొదలయింది . పార్టీ పుట్టుక ఒక ప్రహసనం లా ఉంది . అసలు తెలంగాణ లో పార్టీ పెట్టడమే ఒక అనాలోచిత చర్య . ఒకవైపు సోదరుడు చాతకాని తుగ్లక్ పాలనతో ap ఈ భ్రస్టు పట్టిస్తుంటే .. పదుల సంఖ్యలో సిబిఐ కేసులు మెడకు ఉరి తాడులా వ్రేలాడుతుంటే .. తల్లి విజయమ్మ రెండు రాష్ట్రాల లో అటువైపు ఒక కాలు ఇటువైపు ఒక కాలు వేసి ప్రయాణం చేయడం సాధ్యమా ..?బాబు గారు లాంటి రాజకీయ ఛాణీక్యు డు కూడా రెండు రాష్ట్రాలలో tdp నిల పెట్టలేక ఒక రాష్ట్రానికే పరిమితం కావలసి వచ్చింది . షర్మిల దగ్గర ఉన్న వేలకోట్ల తో cm కావాలను కొన్నది. దానికి రాజన్న రాజ్యం అనే ప్రజల బలహీనత తో దెబ్బ కొట్టాలి అనుకొన్నది . కానీ రాజన్న రాజ్యం అంతా అవనీతి మయం అని అందరికీ తెలుసు .. మజ్జిగ జనానికి ఇచ్చి వెన్న కాజేశాడు అన్న విషయం పేదలకు తెలియదు . అది తెలిసే లోపే చచ్చి దేముడయ్యాడు పాపం . షర్మిల తెలివిగా ఆలోచన చేసి ఉంటే అన్న కోసం పాదయాత్ర చేసిన సానుభూతి ap లో ఒకవర్గం లో ఉంది .. తనకు ,తాను నమ్మించిన ప్రజలకు న్యాయం జరగాలంటే తాను పోరాడాల్సింది ap లో మాత్రమే ..!న్యాయంగా జగన్ అవనీతి కేసులో బైల్ రద్దు చేయమని షర్మిల మోడి మీద వత్తిడి తేవాలి .. జగన్ చేస్తున్న ఆరాచకాలను ప్రశ్నించాలి . పాలన తప్పు అని జనం లోకి వెళ్ళాలి . అసలు రెండవస్తానం తనదే అని జనంలోకి వెళ్ళాలి అప్పుడే తనకు న్యాయం జరుగుతుంది . మిగిలిన సమయం cm గా తన కు న్యాయం జరుగుతుంది . పోయిన దగ్గర వెతుక్కోవాలి కానీ ap లో పోగొట్టుకొని తెలంగాణ లో వెతకడం ఏమిటి ?తెలంగాణ లో kcr ,రేవంత్ రెడ్డి లాంటి నాయకుల మీద పిల్ల కూతలు కూస్తే నాయకురాలు అవుతుందా ?ప్రక్కన 10 మంది డ్రామా ఆర్టిస్ట్ లతో ఉద్యమం మ్యాకప్ తో హైటెక్ దీక్షలు చేస్తే జనం నవ్విపోతారు .. ఇప్పుడు మిగిలిన కొందరు కూడా నీదగ్గర పడి ఉన్న పచ్చ నోట్ల కోసం మాత్రమే అని తెలుసుకో ..!ఇప్పటికైనా కళ్ళు తెరిచి దుకాణం మూసి పెట్టే సద్దుకొని ap లో cm కుర్చీ మీద కర్చీఫ్ వేసుకొంటే బెటర్