తెలంగాణకు మరో అంతర్జాతీయ ఖ్యాతి: మంత్రి శ్రీనివాస్

Another international reputation for Telangana: Minister Srinivas

0
40

ప్రపంచ పర్యాటక సంస్థ (యూఎన్‌డబ్ల్యూటీవో) నిర్వహించిన బెస్ట్‌ టూరిజం విలేజ్‌ పోటీల్లో భారత్‌ నుంచి తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌ పోచంపల్లి గ్రామం ఎంపికైంది. ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అభినందనలు తెలియజేసారు.

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పర్యాటక ప్రాంతాలను గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఎర్పడిన తర్వాత సిఎం కెసిఆర్ గారి నేతృత్వంలో పర్యటకాభివృద్ది కోసం నిరంతర కృషి చేస్తున్నారన్నారు.

• తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సిఎం కెసిఆర్ నేతృత్వంలో కాకతీయుల కళా సంపద రామప్ప దేవాలయంకు యూనేస్కో వారసత్వ కట్టడాల జాబిత లో గుర్తింపు లభించిందన్నారు.

• ఎంతో కాలంగా నిర్లక్ష్యానికి గురైనా తెలంగాణ పర్యాటక రంగానికి నేడు సిఎం కెసిఆర్ నేతృత్వంలో మహర్థశ పట్టిందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.

• గ్రామీణ పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ ఆధ్వర్యంలో బెస్ట్ టూరిజం విలేజ్ కాంటెస్ట్ నిర్వహించింది. సాంఘిక, ఆర్ధిక, పర్యావరణ రంగాల్లో సుస్థిరాభివృద్ధి, గ్రామీణ సాంస్కృతిని ఎలా పరిరక్షిస్తున్నారు/ గ్రామీణ పర్యాటకానికి ఎంత స్కోప్ ఉంది. అక్కడి ప్రజలు దానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారనే అంశాలను పరిగణనలోకి తీసుకున్నారని వెల్లడించారు.

• గ్రామీణ పర్యాటకానికి ఊతం ఇచ్చేలా వాటి అభివృద్ధికి, అక్కడ నివసిస్తున్న ప్రజల జీవనశైలి, నూతన పద్ధతిలో ప్రపంచానికి తెలియజేయడంలో భాగంగా ఐక్యరాజ్య సమితి ప్రపంచ పర్యాటక సంస్థ ఈ పోటీలు నిర్వహిస్తోంది. పర్యాటక రంగానికి ప్రోత్సాహకం, గ్రామీణ ప్రాంతాల్లో జనాభాను పెంచడం, మౌలిక వసతుల కల్పన, సంప్రదాయాల పరిరక్షణ, వాటిని భావితరాలకు అందించటంతో పాటు ఆర్థిక అసమానతల తొలగింపు ఈ పోటీ ఉద్దేశం. ఎంపికైన గ్రామాలను అభివృద్ధి చేయటం, గుర్తింపు తీసుకురావటం వంటి పనులు ఈ సంస్థ చేయనుందని వివరించారు.

ప్రపంచ వ్యాప్తంగా తోలిసారిగా ప్రపంచ పర్యాటక సంస్థ నిర్వహిస్తున్న బెస్ట్ టూరిజం విలేజ్ గుర్తుంపులో భాగంగా కేంద్ర పర్యాటక శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్రంలో గల పర్యాటక పరంగా ఉత్తమ గ్రామీణ ప్రాంతాలను గుర్తించి ప్రపంచ పర్యాటక సంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగా నివేదక పంపాలని 16.06.2021 నాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిందన్నారు మంత్రి శ్రీ వి. శ్రీనివాస్ గౌడ్.

• కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అదేశాల మేరకు మంత్రి శ్రీ వి. శ్రీనివాస్ గౌడ్ సహాకారంతో రాష్ట్ర పర్యాటక శాఖ అధికారులు రాష్ట్రంలో గల గ్రామీణ ప్రాంతాలను పరిశీలించి వాటి స్థితిగతులపై సమగ్ర నివేదిక ను తయారు చేసి భూదాన్ పోచంపల్లిని ఎంపిక చేయడం జరిగిందన్నారు.

• ప్రపంచ పర్యాటక సంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగా భూదాన్ పోచంపల్లి పై నివేదకను తయారు చేసి కేంద్ర పర్యాటక శాఖకు 15.07.2021 నాడు నివేదించటం జరిగిందన్నారు.

• ప్రపంచ వ్యాప్తంగా 75 దేశాల నుండి 170 ప్రతిపాదనలు ఐక్యరాజ్యసమితి వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ (UNWTO) కు వేళ్లాయి. అందులో మన దేశం నుంచి భూదాన్‌ పోచంపల్లితో పాటు మేఘాలయలోని కాంగ్‌థాన్, మధ్యప్రదేశ్‌లోని లద్‌పురాఖాస్‌ కూడా పోటీలో నిలవగా..తెలంగాణ ప్రభుత్వం పంపిన నివేదిక ఆధారంగా ప్రపంచ పర్యాటక సంస్థ (యూఎన్‌డబ్ల్యూటీవో) నిర్వహించిన బెస్ట్‌ టూరిజం విలేజ్‌ పోటీల్లో భారత్‌ నుంచి పోటీపడిన తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌ పోచంపల్లి గ్రామం ఈ ఘనత సాధించిందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కోన్నారు.

• డిసెంబర్ 2న స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో జరిగే UNWTO జనరల్ అసెంబ్లీ 24వ సెషన్‌లో ఈ ప్రతిష్టాత్మక అవార్డు ప్రధానం చేస్తున్నట్లు ప్రకటించిందన్నారు.

• రాష్ట్రంలోని చారిత్రక, పర్యాటక ప్రదేశాలకు అంతర్జాతీయ గుర్తింపు లభిస్తోంది. ఇటీవలే రామప్ప దేవాలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వ హోదాను కల్పించగా..ఇప్పుడు ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా పని చేస్తున్న ప్రపంచ పర్యాటక సంస్థ (యూఎన్‌డబ్ల్యూటీవో) తోలిసారిగా నిర్వహించిన బెస్ట్‌ టూరిజం విలేజ్‌ పోటీల్లో మన దేశం నుంచి పోటీపడిన యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌ పోచంపల్లి గ్రామం ఆ ఘనత సాధించిందన్నారు.

• ఇక, భూదాన్‌పోచంపల్లికి పేరుకు తగినట్టుగా చారిత్రక నేపథ్యం కూడా ఉంది.. భూదానోద్యమానికి అంకురార్పణ చేసి చరిత్ర సృష్టించింది ఈ గ్రామం.. చేనేత వస్త్రాలకు, చేనేత కళాకారుల కళా నైపుణ్యానికి పెట్టింది పేరు పోచంపల్లి.. 1951లో మహాత్మాగాంధీ ప్రియశిష్యుడైన ఆచార్య వినోబాభావే పోచంపల్లిలో పర్యటించడం..ఆయన పిలుపు మేరకు వెదిరె రాంచంద్రారెడ్డి హరిజనులకు 100 ఎకరాల భూమి దానం చేయడంతో భూదానోద్యమానికి అంకురార్పణతో చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని పొందిందన్నారు.

• మరోవైపు.. పోచంపల్లి చేనేత వస్త్రాలకు ప్రత్యేక స్థానం ఉంది. చేనేత కళాకారుల ప్రతిభతో సిల్క్ సిటీ గా పేరు తెచ్చుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా..5,294 చేనేత మగ్గాలకు జియో ట్యాగింగ్ ఉంటే, అందులో సగం భూదాన్ పోచంపల్లిలోనే ఉన్నాయి. గ్రామ జనాభాలో 65 శాతం మంది చేనేత కార్మికులే ఉన్నారు. జిల్లాలో ఉన్న చేనేత కార్మికుల్లో అత్యధిక సంఖ్య పోచంపల్లిదే అని పేర్కోన్నారు.

• పోచంపల్లి చరిత్రపుట్టల్లోకి వెళ్తే.. నిజాం పాలన సమయంలోనూ నిజాం ప్రభువులు.. అరబ్‌దేశాలకు తేలియా రుమాళ్లు, గాజులు, పూసలను ఎగుమతి చేసేవారు.. ఇక, ఎన్నో ప్రత్యేకతలు కలిగిన భూదాన్‌పోచంపల్లి దేశ, విదేశీయులకు అధ్యయన కేంద్రంగా మారిపోయింది. భూదానోద్యమ చారిత్రక గాథ, గ్రామీణ పర్యాటక కేంద్రం, చేనేత, చేతివృత్తులతో పాటు కుటీర పరిశ్రమలు మరోవైపు వ్యవసాయానికి నిలయంగా కొనసాగుతూ వస్తోంది. ఇంకోవైపు నిరుద్యోగ యువతకు ఉచిత స్వయం ఉపాధి కోర్సులకు శిక్షణ ఇస్తున్న జలాల్‌పురంలోని స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థ రాష్ట్రంలోనే పేరు తెచ్చుకోవడం మరో విశేషంగా చెప్పుకోవాలని వెల్లడించారు.

• ఇప్పటికే భూదాన్‌ పోచంపల్లిని అగ్ర రాజ్యాలకు చెందిన టూరిస్టులను ఆకర్షించింది. అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, చైనా, రష్యా.. ఇలా 100 దేశాలకు పైగా పర్యాటకులు ఈ గ్రామాన్ని సందర్శించారు. ఇక, ప్రపంచ టూరిజం సంస్థ ‘బెస్ట్‌ టూరిజం విలేజ్‌’ గౌరవాన్ని దక్కించుకున్న ఈ గ్రామానికి మరింతగా పర్యాటకుల తాకిడీ పెరగనుంది అని అంచనా వేస్తున్నారు. చారిత్రక నేపథ్యం ఉన్న గ్రామాన్ని బెస్ట్‌ టూరిజం విలేజ్‌గా ఎంపిక చేయడంపై ఆ గ్రామ ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు.

• ప్రపంచ టూరిజం సంస్థ ‘బెస్ట్‌ టూరిజం విలేజ్‌’ గౌరవాన్ని దక్కించుకున్నభూదాన్ పోచంపల్లికి పర్యాటకుల తాకిడి దృష్టిలో పెట్టుకోని పర్యాటకులకు మరిన్ని మౌలిక సదుపాయాల కల్పన ను యుద్ద ప్రతిపాదికన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

• పోచంపల్లి చేనేత కళాత్మక ఉత్పత్తులు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పోందే అవకాశాలున్నాయిన్నారు.
• తెలంగాణ రాష్ట్రంలో విదేశీ పర్యాటకులు సంఖ్య త్వరలో ఘననీయంగా పేరిగే అవకాశాలున్నాయని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు.