దారుణం – టమాటోల కోసం గొడవ – 20 మంది మృతి- ఎక్కడంటే

-

ఈ మధ్య చిన్న చిన్న విషయాలకు కూడా ఘర్షణకు దిగుతున్నారు కొందరు.. ఏకంగా హత్యలు చేసుకునే వరకూ ఈ గొడవలు వెళుతున్నాయి…. ఈ గొడవ సమిసిపోయిన తర్వాత కొందరు కక్ష్య పెట్టుకుని మరీ హత్యలకు పాల్పడుతున్నారు..
బంగారం కోసం, డబ్బు కోసం గొడవలు పడి ప్రాణాలు తీసుకున్నా ఘటనలు చూశాం… కానీ ఓ 20 కేజీల టమాటోల కోసం గొడవ పడ్డారు.అంతేకాదు మరీ దారుణంగా ప్రాణాలు కూడా పొగొట్టుకున్నారు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది అంటే గంపెడు టమాటోల కోసం నైజీరియా దేశస్తులు కొట్టుకోవడం సంచలనం రేపుతోంది. ఇప్పటి వరకు 20 మంది మృతి చెందారు. అసలు ఏం జరిగింది అంటే.గత నెలలో ఒక వ్యక్తి బుట్టలో టమాటలతో నైరుతి నగరమైన ఇబాడాన్లోని మార్కెట్కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది, అక్కడ ఉన్న టమోటాలు రోడ్డుపై పడ్డాయి, దీంతో పక్కన ఉన్న దుకాణాదారులతో గొడవ జరిగింది, ఈ వివాదం గురించి సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి, అనేక ప్రాంతాల్లో దుకాణాలపై దాడి చేసి పలువురిని అగ్నికి ఆహుతి చేశారు. ఈ హింసలో ఇప్పటివరకు 20 మంది చనిపోయారు. దీంతో ఈ ప్రాంతం పోలీసులు ఆధీనంలో ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

తిరుపతి లడ్డూ తయారీ నెయ్యిలో పశువుల కొవ్వు.. సీఎం సంచలన వ్యాఖ్యలు

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం(Tirumala Prasadam) తయారీలో పశువుల కొవ్వులు కలిపారని,...

‘వైసీపీలో ఏడ్చిన రోజులు ఉన్నాయి’.. పార్టీ మార్పుపై బాలినేని క్లారిటీ..

ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి(Balineni Srinivasa Reddy).. వైసీపీకి...