జూ పార్క్ లో దారుణం – పాములకి ఆహారం వేస్తూ – పాము కాటుతో ఉద్యోగి మృతి

-

జూ పార్క్ లో జంతు సంరక్షకుల ఉద్యోగం అంటే చాలా కష్టం… ఎందుకు అంటే అక్కడ క్రూరమైన జంతువులు ఉంటాయి, ఏదైనా తేడా జరిగింది అంటే అవి ఉద్యోగులపై దాడి చేస్తాయి. అందుకే ఇక్కడ ఉద్యోగం అంటే చాలా మంది వెనకడుగు వేస్తారు, అయితే ఇలా దాడి జరిగిన ఘటనలు కూడా చాలా ఉన్నాయి.

- Advertisement -

తిరుపతి జూ పార్క్ లో దారుణం జరిగింది…జూ పార్క్ లో ఉన్న పాముల సంరక్షకురాలు పాములకు ఆహారం వేసే క్రమంలో పాము కాటుకు గురై ప్రాణాలు విడిచింది…తిరుపతి ఎస్వీ జూ పార్క్ లో జంతుసంరక్షకురాలిగా విజయమ్మ పని చేస్తున్నారు, అయితే రోజు ఆమె పాములకి పక్షులకి ఆహారం వేస్తారు. ఈ సమయంలో ఓ పాము ఆమెని కాటు వేసింది.

వెంటనే ఆమెని ఆస్పత్రికి తరలించారు అయితే ఆమె మూడు రోజులు చికిత్స తీసుకుంటూ మరణించారు, ఇక దాదాపు ఆమె పది సంవత్సరాలుగా ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు.. ఆమె మరణంతో జూ సిబ్బంది సంతాపం వ్యక్తం చేశారు. విజయమ్మ కుటుంబానికి జూ పార్క్ తరుపున ఆర్ధిక సహాయం చేస్తామని అధికారులు తెలిపారు.పాము విషం నేరుగా విజయమ్మ మెదకు చేరుకోవడం ఆమె మరణించింది అని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

GV Reddy | ఏపీ ఫైబర్‌నెట్ ఛైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామా..

ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ పదవికి జీవీ రెడ్డి(GV Reddy) రాజీనామా...

Delhi Assembly | ఖాళీ ఖజానా కాదు.. ఢిల్లీ అసెంబ్లీ తొలిరోజే రగడ

ఢిల్లీలో 27 ఏళ్ళ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ తొలి అసెంబ్లీ(Delhi...