ఏపీ ఉద్యోగులకు బిగ్ షాక్..సమ్మెకు ఆ ఉద్యోగులు దూరం!

Big shock to AP employees..they are far from the strike

0
78

ఏపీలో గత కొద్దిరోజులుగా పీఆర్సీ రగడ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో పీఆర్సీ సాధన సమితి ప్రతినిధి బొప్పరాజు సంచలన ప్రకటన చేశారు. ఈ నెల ఐదు నుంచి సహయ నిరాకరణ ఉద్యమం ప్రారంభిస్తామని ఏడు నుంచి సమ్మె మొదలు పెడతామని ప్రకటన చేశారు. విద్యుత్, ఆర్టీసీ ఉద్యోగులు కూడా ఉద్యమంలోకి వస్తున్నారని స్పష్టం చేశారు. ఇలా చెప్పిన కొన్ని గంటలకే ఉద్యోగులకు షాక్ ఇచ్చింది ఆర్టీసీ. పీఆర్సీ సాధన సమితికి మద్దతుగా‌ ఆర్టీసీ సంఘాలు సమ్మె చేస్తామనడం కరెక్ట్ కాదని.. ఆ ఉద్యోగుల పీఆర్సీకి మా ఆర్టీసీ పీఆర్సీకి సంబంధం లేదని ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ మల్లిఖార్జున రెడ్డి పేర్కొన్నారు.

పాదయాత్రలో సీఎం జగన్ యూనియన్లకు ఇచ్చిన మాట ప్రకారం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. ఆర్టీసీలో అప్పులు కట్టుకోండి మీ నుంచి ప్రభుత్వానికి డబ్బులు వద్దని సీఎం చెప్పారని గుర్తు చేశారు. ప్రభుత్వమే ఆర్టీసీలోని వారికి జీతాలు చెల్లిస్తోందని.. రూ. 4,800 కోట్ల అప్పు ఇంకా ఆర్టీసీకి ఉందని చెప్పారు.

కోవిడ్ నష్టం ఆర్టీసీని మరింత అప్పుల్లోకి నెట్టింది. తెలంగాణా ఆర్టీసీలో ఉద్యోగస్తులు, సిబ్బందికి సకాలంలో జీతాలు పడేవి కావన్నారు. ఆర్టీసీ సంఘాలు మరోసారి పునః పరిశీలించుకోవాలని.. ఆర్టీసీ సంఘాలు సమ్మెకు వెళ్తే ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ఆలోచిస్తామని ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ మల్లిఖార్జున రెడ్డి ప్రకటన చేశారు.