బ్రేకింగ్ — బీజేపీలో చేరుతున్నా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

-

తెలంగాణ‌లో లోట‌స్ పార్టీ దూసుకుపోతోంది… పార్టీలో చేరే వారికి వెల్ కం చెబుతోంది.. ముఖ్యంగా దుబ్బాక జీహెచ్ ఎంసీ ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత టీఆర్ఎస్ కు ప్ర‌త్యామ్నాయంగా బీజేపీ మారుతోంది అనే చెప్పాలి.. ఇక కాంగ్రెస్ పార్టీ ఇక్క‌డ దారుణ‌మైన స్ధితిలోకి వెళ్లిపోయింది. అయితే చాలా మంది సీనియ‌ర్ నేత‌లు కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి బీజేపీ‌లో చేరుతున్నారు.. ఇటీవ‌ల విజ‌య‌శాంతి కూడా బీజేపీలో చేరిపోయారు.

- Advertisement -

తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన ప్రకటన చేశారు. తాను బీజేపీలో చేరబోతున్నట్టు ప్రకటించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన ఈ కీల‌క విష‌యం తెలిపారు, ఇప్ప‌టికే కొన్ని నెలలుగా ఆయ‌న బీజేపీలో చేరుతున్నారు అని వార్త‌లు వినిపించాయి ..కాని తాజాగా ఆయ‌న బీజేపీ లో చేరేందుకు రెడీ అయ్యారు.

తెలంగాణలో టీఆర్ఎస్‌కు బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయమని ఎప్పుడో చెప్పానన్నారు. త‌న సోద‌రుడు మాత్రం కాంగ్రెస్ లో కొన‌సాగుతారు అని తెలిపారు.. తాము ఏ పార్టీల్లో ఉన్నా అన్నదమ్ములుగా కలిసే ఉంటామన్నారు. తెలంగాణ పీసీసీ చీఫ్ ప‌ద‌విపై మాట్లాడుతూ కాలం నిర్ణ‌యిస్తుంది అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...