ఈ గుడిలో చికెన్, మటన్ బిర్యానీలు ప్రసాదాలు – ఎక్కడంటే

-

ఒక్కో దేవాలయంలో ఒక్కో ఆచారం ఒక్కో సంప్రదాయం ఉంటాయి, అయితే కొన్ని దేవాలయాల్లో ఇలాంటి ప్రసాదాలు పెడతారా అని ఆశ్చర్యపోతారు కొందరు… నిజంగా ఇప్పుడు చెప్పబోయే దేవాలయం కూడా అలాంటిదే, ఇక్కడ ప్రసాదం ఏమిటో తెలుసా, కోడి కూర మటన్ , బిర్యానీలు, మరి ఈ ప్రసాదాలు ఏమిటి అని ఆశ్చర్యపోతున్నారా ఆ స్టోరీ చూద్దాం.

- Advertisement -

తమిళనాడులోని మధురైలో ఉండే మునియాండి స్వామి దేవాలయంలో చికెన్, మటన్ బిర్యానీలు ప్రసాదంగా పంచుతారు. ఇలా ఎన్నో ఏళ్లుగా నాన్ వెజ్ ప్రసాదాలు పెడుతుంటారు. ప్రతీ ఏడాది జనవరి 24 నుంచి 26 వరకు జరిగే వార్షిక ఉత్సవాల్లో ఈ బిర్యానీ ప్రసాదం ఉంటుంది. ఈ ప్రసాదం కోసం భక్తులు పెద్ద ఎత్తున వస్తారు, ఇది తింటే తమ పాపాలు పోతాయి అని భక్తుల నమ్మకం.

ఈ ప్రసాదం తయారీకి 1000 కేజీల బియ్యం, 150 మేకలు, 300 కోళ్లను వినియోగిస్తారు. గుడికి వచ్చే భక్తుల పట్ల ఏ మాత్రం వివక్ష చూపకుండా వాళ్లు తిన్నంత బిర్యానీ పెడతారు…. అంతే కాదు ఈ బిర్యానీని పార్శిల్ కూడా తీసుకునే వీలుంది. 84 సంవత్సరాలుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. ఇంకా వందేళ్లు అయినా ఈ సంప్రదాయం కొనసాగిస్తాం అంటున్నారు ఇక్కడ ఆలయ అధికారులు ప్రజలు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

తిరుపతి లడ్డూ తయారీ నెయ్యిలో పశువుల కొవ్వు.. సీఎం సంచలన వ్యాఖ్యలు

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం(Tirumala Prasadam) తయారీలో పశువుల కొవ్వులు కలిపారని,...

‘వైసీపీలో ఏడ్చిన రోజులు ఉన్నాయి’.. పార్టీ మార్పుపై బాలినేని క్లారిటీ..

ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి(Balineni Srinivasa Reddy).. వైసీపీకి...