కాసేపట్లో యాదాద్రి పర్యటనకు సీఎం కేసీఆర్

Chief Minister KCR to visit Yadadri for a while

0
55

తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి పునర్నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఆలయ ఉద్ఘాటన తేదీ సమీపిస్తుండటంతో పనుల పురోగతిపై సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. తాజాగా ఇవాళ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ సందర్శించనున్నారు. కాసేపట్లో రోడ్డు మార్గం ద్వారా యాదాద్రి వెళ్తారు. ముగింపు దశలో ఉన్న ఆలయ పునర్నిర్మాణ పనులను సీఎం పరిశీలించనున్నారు.