సీఎం కేసీఆర్‌ మనవడు ఆస్ప‌త్రిలో చేరిక కాలికి గాయం

-

తెలంగాణ సీఎం కేసీఆర్‌ మనవడు, మంత్రి కేటీఆర్‌ కుమారుడు హిమాన్షు ఆస్ప‌త్రిలో చేరారు అనే వార్త ఇప్పుడు వినిపిస్తోంది, అయితే ఆయ‌న కాలికి గాయం కావ‌డంతో ఆస్ప‌త్రిలో చేర్పించార‌ట..‌
హిమాన్షును చికిత్స కోసం బుధవారం రాత్రి సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేర్పించారు. నొప్పి కారణంగా నిలబడలేని స్థితిలో హిమాన్షును య‌శోదలో చేర్చారు.

- Advertisement -

అయితే ఆయ‌న‌కు అక్క‌డ సిటీ స్కాన్ చేశారు, కాలికి తుంటి ప్రాంతంలో, మోకాలికి ఫ్రాక్చర్‌ అయినట్లు గుర్తించి చికిత్స అందిస్తున్నారు. మంత్రి కేటీఆర్ దంపతులు రాత్రంతా ఆస్పత్రిలో కుమారుడితో పాటే ఉన్నట్లు తెలిసింది.

అయితే ఇంటిలో ప్ర‌మాద‌వ‌శాత్తు కాలుజారి కింద ప‌డిన‌ట్లు తెలుస్తోంది, దీంతో ఆ నొప్పి తీవ్ర‌త మ‌రింత పెరిగింది, సోష‌ల్ మీడియాలో కేసీఆర్ మ‌న‌వ‌డు చాలా యాక్టీవ్ గా ఉంటున్నారు, త‌న‌కు తోచిన సాయం చేస్తున్నారు, ఎవ‌రైనా వైద్య సాయం కోరితే వారికి సాయం చేస్తున్నారు..హిమాన్షు అంటే సీఎం కేసీఆర్‌కు ఎంతో ప్రేమ హిమాన్షుకి గాయం అవ్వ‌డంతో యశోదా ఆస్పత్రి వైద్యులకు సీఎం కేసీఆర్ ఫోన్ చేసి ఆరాతీసినట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

హిందూ సమాజానికి చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి.. భూమన డిమాండ్

హిందు పరమ పవిత్రంగా భావించిన తిరుమల ప్రసాదాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేద్దామనుకున్న...

తిరుమల లడ్డూ ప్రసాద నెయ్యిపై ఇచ్చిన నివేదిక అప్పుడే తప్పవుతుంది: NDDB

NDDB Report | తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డూ ప్రసాద తయారీలో...