టీడీపీలో చేరిన కాంగ్రెస్ అధికార ప్రతినిధి

Congress spokesperson who joined the TDP

0
125

ఏపీ: కాంగ్రెస్ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఆయనకు పార్టీ కండువా కప్పి టీడీపీ అధినేత చంద్రబాబు ఆహ్వానించారు. ఈ సందర్బంగా జీవీ రెడ్డి మాట్లాడుతూ..ప్రస్తుతం రాష్ట్రంలో క్రియాశీలక పార్టీలో చేరాలనే నిర్ణయంతో టీడీపీలో చేరాను.

చంద్రబాబు అభివృద్ధి కోరుకునే వ్యక్తి అయితే..జగన్ వినాశనాన్ని కోరుకునే వ్యక్తి. రాష్ట్రానికి మరింత నష్టం చేకూరడదంటే చంద్రబాబును బలపర్చాల్సిన అవసరం ఉంది. కొన్ని వర్గాలు చంద్రబాబుపై అకారణంగా ద్వేషం పెంచుకోవడం వలనే రాష్ట్రం నాశనమైందని విమర్శించారు.