FLASH NEWS – ప్లాట్ఫామ్ టిక్కెట్ ధర 50 రూపాయలు కీలక నిర్ణయం ఎక్కడంటే

-

ప్లాట్ఫామ్ టిక్కెట్ ధర పదిరూపాయలు ఉంటుంది అయితే ఫెస్టివల్ సమయంలో ఈ ధర 20 రూపాయలు ఉంటుంది అనేది తెలిసిందే, అయితే తాజాగా సెంట్రల్ రైల్వే షాకిచ్చింది. ప్లాట్ఫామ్ టిక్కెట్ ధరను 10 రూపాయల నుంచి ఏకంగా 50 రూపాయలకు పెంచింది. ముఖ్యమైన రైల్వే స్టేషన్లో ఈ ధరలు మార్చి 1 నుంచి అమలులోకి వస్తాయి. జూన్ 15 వరకు ఈ ధరలు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు.

- Advertisement -

దీనికి కారణం కూడా ఉంది ఇప్పటికే కరోనా కేసులు మళ్లీ ముంబైలో పెరుగుతున్నాయి… ప్రధాన నగరాల్లో కేసులు నెమ్మదిగా పెరగడంతో తాజా నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపారు. ముఖ్యంగా స్టేషన్ ఫ్లాట్ ఫామ్ కి కేవలం రైలు ఎక్కేవారు మాత్రమే వస్తారు అని ఈ నిర్ణయం తీసుకున్నారు.

రద్దీ అనేది తగ్గుతుంది, కచ్చితంగా టికెట్ తీసుకుని ఎవరైనా వెళ్లాల్సిందే.ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, దాదర్ అండ్ లోకమాన్య తిలక్ టెర్మినస్తో పాటు థానే, కళ్యాణ్, పన్వేల్, బీవాండీ రైల్వే స్టేషన్లలో తాజాగా ఈ పెంచిన ధరలు అమలులోకి వస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

హిందూ సమాజానికి చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి.. భూమన డిమాండ్

హిందు పరమ పవిత్రంగా భావించిన తిరుమల ప్రసాదాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేద్దామనుకున్న...

తిరుమల లడ్డూ ప్రసాద నెయ్యిపై ఇచ్చిన నివేదిక అప్పుడే తప్పవుతుంది: NDDB

NDDB Report | తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డూ ప్రసాద తయారీలో...