Flash: మంత్రికి అస్వస్థత..ఆసుపత్రిలో చేరిక

0
84

ఏపీ మునిసిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. మార్కాపురం లోని జార్జి ఇంజనీరింగ్ కాలేజీ లో ఈరోజు ఉదయం వాకింగ్ చేస్తుండగా మంత్రి అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయనకు జార్జీ ఇంజనీరింగ్ కాలేజీలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇటీవల మంత్రి సురేష్ కు వైద్యులు యాంజియోగ్రామ్ చేసిన విషయం తెలిసిందే.