జగనన్నా నా అకౌంట్లో డబ్బులు వచ్చాయేచ్

జగనన్నా నా అకౌంట్లో డబ్బులు వచ్చాయేచ్

0
76

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు ఉదయం మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే…. ప్రజా సంకల్పయాత్రలో అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన హామీని తాజాగా జగన్ దాన్ని అమలు చేశారు…

గుంటూరు జిల్లా పేరెడ్ గ్రౌండ్ లో నిర్వహించిన సభలో జగన్ ఆన్ లైన్ విధానంలో అగ్రిగోల్డ్ బాధితులు దబ్బుల బట్వాడా చేశారు… 10 వేల కన్నా తక్కువ డిపాజిల్ చేసిన వారికి డబ్బు పంపిణీ ఈ రోజులు ఉదయం మొదలైంది… మొత్తం 3.70 లక్షల బాధితులకు ఒక్క క్లిక్ ద్వారా జగన్ సుమారు 264 కోట్లను బదిలీ చేశారు…

జగన్ ల్యాబ్ టాప్ లో సింగల్ క్లిక్ చేయగా బాధితుల ఖాతాల్లో డబ్బుల జమ అయినట్లు మెసెజ్ లు వచ్చాయి.. ఆ మెసెజ్ ను సభలో నే జగన్ కు చూపిస్తూ ఆనందం వ్యక్తం చేశారు ప్రజలు…

తన అకౌంట్లో రూ.10 వేలు జమ అయ్యాయని చూపిస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్న నరసన్నపేట మండలం, కిల్లం గ్రామానికి చెందిన పొట్నూరు శ్రీనివాసరావు చూపుతున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది…

Attachments area