కేసీఆర్‌ ఒక నయానిజాం..బహిరంగ సభలో సీఎంపై జేపీ నడ్డా ఫైర్

0
68
Sri JP Nadda,BJP National Working President addressing at a public meeting at Exhibition grounds in Hyderabad on Sunday. Pic:Style photo service.

తెలంగాణలో కేసీఆర్‌ ఒక నయానిజాం వలే వ్యవహరిస్తున్నారని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపడమే తమ లక్ష్యమన్నారు. బండి సంజయ్‌ పాదయాత్ర ముగింపు సందర్భంగా హనుమకొండలో జరుగుతున్న భాజపా భారీ బహిరంగ సభలో జేపీ నడ్డా ఈ వ్యాఖ్యలు చేశారు.

చివరి నిజాం ఉస్మాన్‌ అలీఖాన్‌ కూడా కేసీఆర్‌ వంటి ఆంక్షలే విధించారు. మల్టీ స్పెషాల్టీ ఆస్పత్రి నిర్మిస్తామని వరంగల్‌ జైలును కూల్చారు. ఇన్ని రోజులు గడుస్తున్నా వరంగల్‌లో మల్టీస్పెషాల్టీ నిర్మించలేదు. జల్‌ జీవన్‌ మిషన్‌ కింద రాష్ట్రానికి రూ.3500 కోట్లు కేటాయిస్తే తెలంగాణ ప్రభుత్వం మాత్రం రూ.200 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది.

కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్‌ భారీగా అవినీతికి పాల్పడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్‌ ఏటీఏంగా మార్చుకున్నారు. ఎంఐఎంకు భయపడి తెలంగాణ విమోచనదినాన్ని నిర్వహించటం లేదు. అవినీతికి పాల్పడినందునే కేసీఆర్‌లో భయం మొదలైంది. అవినీతి, కుటుంబ పాలనను అంతం చేయాల్సిన సమయం ఇదేఅని ఆయన అన్నారు.