మన దేశంలో పెట్రోల్ లీటర్ 50 కి రానుంది కేంద్రం ఏ చేయబోతోందో తెలుసా

మన దేశంలో పెట్రోల్ లీటర్ 50 కి రానుంది కేంద్రం ఏ చేయబోతోందో తెలుసా

0
55

చాలా మంది పేద మధ్య తరగతి వారు పెట్రోల్ డీజీల్ కే తమ సంపాదన అయిపోతోంది అని భాపడతుంటారు.. కాని తాజాగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంటోంది అని తెలుస్తోంది.. వచ్చే రోజుల్లో పెట్రోల్ లీటర్ 50 రూపాయలు మాత్రమే అమ్మేలా నిర్ణయాలు తీసుకుంటోంది, మన దేశంలోకి ఇథనాల్ పరిశ్రమలు రానున్నాయి… దేశంలో ప్లాస్టిక్ వ్యర్ధాలతో ఇథనాల్ తయారు చేస్తారు.. దీనిని పెట్రోల్ లో కలుపుతారు, దీని వల్ల పెట్రోల్ ఇథనాల్ ప్రొడక్షన్ పెరుగుతుంది.

అప్పుడు 80 రూపాయల నుంచి పెట్రోల్ ధర సమానంగా 50 రూపాయలకు దొరుకుతుంది.. కేంద్రం మన దేశంలో అనేక ఇథనాల్ సంస్ధలను స్టార్ట్ చేయనుంది. ఇలా చేయడం వల్ల వేస్ట్ ప్లాస్టిక్ కూడా తొలగిపోతుంది. దాదాపు 200 సంస్దలు స్టార్ట్ అవనున్నాయని తెలుస్తోంది.
అంతేకాదు పెట్రోల్ డీజీల్ పై వసూలు చేసే టాక్స్ కూడా తగ్గించనుంది. దీనిపై జీఎస్టీలో మినహాయింపు లేదా భారీగా పన్నులు తగ్గించాలి అని చూస్తున్నారు… పెట్రోల్ డీజీల్ పై అన్ని రాష్ట్రాలు వ్యాట్ తగ్గించేలా కేంద్రం చట్టం తీసుకురానుంది.

అలాగే బ్యాటరీ వాహనాలు తీసుకురానున్నారు. ఈ పరిశ్రమకు రాయితీలు ఇస్తారు. అంతేకాదు ఈ బైక్ తీసుకునే వారి సంఖ్య పెంచేలా వాటికి ట్యాక్స్ లు లేకుండా చేయనున్నారు… దీని వల్ల పెట్రోల్ వినియోగం కూడా తగ్గిపోతుంది అని ఆలోచిస్తున్నారు…బ్యాటరీ బైక్స్ భారీగా మన దేశంలో తయారు చేసే యూనిట్లకు పర్మిషన్ ఇవ్వనుంది ప్రభుత్వం… దీంతో చాలా మంది బైక్ యూజర్స్ హ్యాపీ ఫీల్ అవుతున్నారు… అయితే వచ్చే రెండు సంవత్సరాలలో మన భారత్ లో ఇలాంటి పరిస్దితి కనిపించనుందట.