Breaking: ఒమిక్రాన్ ఎఫెక్ట్..ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం

Omikron Effect is a key decision of the Delhi Government

0
162

ఒమిక్రాన్, కోవిడ్ విజృంభిస్తున్న తరుణంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శని, ఆదివారాల్లో వీకెండ్ కర్ఫ్యూను ప్రకటించింది కేజ్రివాల్ సర్కార్. దీనితో అక్కడి ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా వర్క్ ఫ్రం హోం చేయనున్నారు. మరోవైపు ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న ఆయన కరోనా టెస్ట్‌ చేయించుకోగా.. పాజిటీవ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.