పవన్ కల్యాణ్ కు 75 బాబుకి 25 రాజధాని రైతుల రేటింగ్

పవన్ కల్యాణ్ కు 75 బాబుకి 25 రాజధాని రైతుల రేటింగ్

0
74

రాజధాని ప్రాంతంలో రైతులు చంద్రబాబు కంటే పవన్ వెంట ఎక్కువగా ఉంటున్నారు.. అయితే చంద్రబాబు చేసిన మోసం వల్లే తమకు ఈ పరిస్దితి వచ్చింది అని, కేవలం తాత్కాలికం తాత్కాలికం అని చెప్పి చివరకు మమ్మల్ని నిండా ముంచారు అని రాజధాని రైతులు అంటున్నారు, అయితే ప్రశ్నిస్తా మీ వెంట నేను ఉన్నా అని చెబుతున్న పవన్ కల్యాణ్ తో రాజధాని రైతులు భేటీ అవుతున్నారు.

మీరే మాకు న్యాయం చేయాలి అంటున్నారు రైతులు.. అయితే ఇప్పుడు చంద్రబాబు కన్నా పవన్ పైనే రాజధాని రైతులు ఆశలు పెట్టుకున్నారు అంటున్నారు.. అసలు మూడు రాజధానుల విషయంలో ముందు నుంచి పవన్ కూడా బాబు కంటే ఎక్కువ పోరాటం చేస్తున్నారు, కాని రాజకీయంగా చంద్రబాబు జగన్ విమర్శలు ఆరోపణలు పార్టీల వైపు నుంచి చేసుకుంటున్నారు.. కాని ఇది కరెక్ట్ కాదని తమకు ఇలా అయితే న్యాయం జరగదు అని రైతులు చెబుతున్నారు.

అందుకే పవన్ పైనే ఆశలు పెట్టుకున్నారు రాజధాని రైతులు… ఎవరిని అడిగినా జగన్ పై పోరాటం చేసి రాజధాని తరలింపు ఆపే సత్తా కేవలం పవన్ కు మాత్రమే ఉంది అని రైతులు 75శాతం మంది చెబుతున్నారు.. దీంతో రాజధాని రైతులు పవన్ పైనే ఆశలు పెట్టుకున్నారు…బీజేపీతో కలిసి పోరాడతామని ఇప్పటికే జనసేన పార్టీ స్పష్టం చేసిన విషయం తెలిసిందే… వైసీపీ తీసుకున్న రాజధాని నిర్ణయం వైసీపీ వినాశనానికి నాంది అని పవన్ నిన్న మండిపడ్డారు. సో రైతులకి ఆయన ఏం భరోసా ఇస్తారో చూడాలి.