Ponguleti Srinivas Reddy | ఏపీ సీఎం జగన్‌తో పొంగులేటి శ్రీనివాస రెడ్డి భేటీ!

-

తెలంగాణ కాంగ్రెస్ నేత, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti Srinivas Reddy) ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో భేటీ అయ్యారు. గురువారం తాడేపల్లికి వచ్చి సీఎంను కలిశారు. దాదాపు గంటసేపు వీరిద్దరూ మాట్లాడుకున్నారు. తాజాగా.. రాహుల్ గాంధీ(Rahul Gandhi) సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్న పొంగులేటి ఇవాళ జగన్‌(Jagan)తో భేటీ కావడంతో పలు ఊహాగానాలు సాగుతున్నాయి. పొంగులేటి గతంలో కాంగ్రెస్ పార్టీలో చేరకముందు వైఎస్ జగన్‌ను కలిసినప్పుడు వ్యాపార పనుల నిమిత్తం వచ్చారని భావించారు. కానీ, ఇప్పుడు కాంగ్రెస్ నేతగా ఉంటూ వైఎస్సార్సీపీ అధినేతగా ఉన్న జగన్‌ను ఆయన కలవడంతో ఇరువురి చర్చలకు ప్రాధాన్యత ఏర్పడింది. ఇవాళ వీరిద్దరి చర్చల్లో కాంగ్రెస్‌లో విలీనం అయ్యేందుకు సిద్ధమైన వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు, జగన్ సోదరి షర్మిల టాపిక్ కీలకమని తెలుస్తోంది. ముఖ్యంగా వైఎస్ షర్మిల(YS Sharmila) కాంగ్రెస్ పార్టీలో చేరితే ఏపీసీసీ ఛీఫ్ బాధ్యతలు అప్పగించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ చేరిక ప్రభావం వైసీపీపై ఏ విధంగా ఉంటుందన్న దానిపై వైఎస్ జగన్-పొంగులేటి(Ponguleti Srinivas Reddy) చర్చించుకుని ఉండొచ్చన్న ప్రచారం జరుగుతోంది.

- Advertisement -
Read Also:
1. ధరణి కి ధీటుగా భూమి డిక్లరేషన్ విడుదల చేసిన టీపీసీసీ

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....

THSTI లో ప్రాజెక్ట్ రీసెర్చ్ స్టాఫ్ కి నోటిఫికేషన్

ఫరీదాబాద్ (హరియాణా)లోని ప్రభుత్వరంగ సంస్థకు చెందిన ట్రాన్టేషనల్ హెల్త్ సైన్స్ అండ్...