Breaking: హైదరాబాద్ చేరుకున్న ప్రధాని మోదీ

0
43

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్​ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న మోడీకి గవర్నర్​ తమిళిసైతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ స్వాగతం పలికారు. బేగంపేట నుంచి నేరుగా ప్రత్యేక హెలికాప్టర్​లో నోవాటెల్​ హోటల్​కు వెళ్లారు. అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుని అక్కడి నుంచి హెలికాప్టర్​లో హెచ్​ఐసీసీకి చేరుకున్నారు. కాసేపట్లో భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో మోదీ పాల్గొననున్నారు.