Breaking: తెలంగాణ సీపీగెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

0
60

తెలంగాణ విద్యార్థులకు సర్కార్ శుభవార్త ప్రకటించింది. పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష (సీపీగెట్-2022) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. నేటి నుంచి జులై 4వ తేదీ వరకు దరఖాస్తు పక్రియ కొనసాగుతుందని, ఆలస్య రుసుంతో జులై 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి వెల్లడించారు.

కాగా సీపీగెట్ ప్రవేశ పరీక్ష జులై 20 నుంచి ఆన్‌లైన్ లో నిర్వహించనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా తెలంగాణలోని ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, మహాత్మాగాంధీ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, జేఎన్‌టీయూహెచ్ యూనివర్సిటీ, మహిళా యూనివర్సిటీల్లో సంప్రదాయ పీజీ కోర్సుల్లో ప్రవేశాలు క‌ల్పిస్తామ‌ని లింబాద్రి తెలిపారు.