Revanth Reddy | పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిందే.. రేవంత్ పిలుపు

-

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) దూకుడు పెంచారు. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో 120 రోజులు ఇంటికి సెలవు పెట్టి కష్టపడి పని చేయాలని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఎన్నికల చట్టాల్లో మార్పులను ఉపయోగించుకునేందుకు కుయుక్తులు పన్నుతున్నాయని తెలిపారు. దీనిని ఎదుర్కొనేందుకు చేయాల్సిన కార్యాచరణ కోసమే ఈ కార్యక్రమమని చెప్పారు. బీజేపీ(BJP), బీఆర్ఎస్‌(BRS)ను ధీటుగా ఎదుర్కొనేందుకు తమ శ్రేణులను ఎన్నికలకు సంసిద్ధులను చేసుకోవాలని వెల్లడించారు. గాంధీ భవన్(Gandhi Bhavan) నుంచి, గ్రామస్థాయి వరకు అందరూ అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు. మండల, డివిజన్, జిల్లా, పట్టణ అధ్యక్షులకు బోయినపల్లి రాజీవ్ నాలెడ్జ్ సెంటర్ లో జూలై 18న ట్రైనింగ్ ఉంటుందని వెల్లడించారు. ఈ నెల 15 లోగా మండలాలు, డివిజన్ అధ్యక్షుల నియామకాలు పూర్తి చేస్తామని ఆయన(Revanth Reddy) స్పష్టం చేశారు.

- Advertisement -
Read Also:
1. ఇవి తింటే ఉన్న వయసుకంటే 10 ఏళ్లు యంగ్ గా కనిపిస్తారు

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...