ఆశ్చర్యం – కుక్కలకు, గుర్రాలకు పెన్షన్ కొత్త  చట్టం ఎక్కడంటే 

-

మనుషులకు పెన్షన్ ఇవ్వడం చూశాం కానీ జంతువులకు పెన్షన్  ఏమిటి అని ఆశ్చరం కలుగుతోందా, ఎస్ మీరు విన్నది నిజమే.. మరి మన దేశంలో కాదు ఇది ఎక్కడ అనేది తెలుసుకుందాం.. పోలాండ్ దేశంలో కుక్కలు, గుర్రాలకు పెన్షన్ అందిస్తున్నారు.
పోలెండ్ దేశంలో  రాష్ట్ర ప్రభుత్వాలకు సర్వీసు అందిస్తున్న కుక్కలు, గుర్రాల కోసం ప్రత్యేకించి పెన్షన్ అందించేందుకు పోలాండ్ ప్లాన్ చేస్తోంది. ఇక్కడ మనుషుల మాదిరి కుక్కలు గుర్రాలు సర్వీసులు సేవలు అందిస్తున్నాయి, అంతేకాదు అనేక సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి, అందుకే వాటి శ్రమను గుర్తించి పెన్షన్ ఇవ్వాలి అని భావిస్తున్నారు.
మరో విషయం ఏమిటి అంటే  పోలాండ్ దేశంలో పోలీస్, బోర్డర్ గార్డ్, ఫైర్ సర్వీస్లో పనిచేసే కుక్కలు, గుర్రాల కోసం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. వాటికి భవిష్యత్తులో సంక్షేమ నిధి భద్రత నిధి ఏర్పాటు చేస్తారు,  ఇక దీనికి సంబంధించి ముసాయిదా చట్టం ఈ ఏడాది చివరన పార్లమెంట్  కి రానుంది… మొత్తం సర్వీసులో 1,200 కుక్కలు, 60కి పైగా గుర్రాలు ఉన్నాయి.
జర్మన్ లేదా బెల్జియన్ షెపర్డ్స్ కుక్కలు ఇక్కడ సేవలు అందిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...