Rajya sabha: తెలుగు ఎంపీలకు రాజ్యసభ కమిటీల్లో చోటు.. వారు వీళ్లే

-

Telugu states mps have got berths in the nine Rajya sabha Committees: రాజ్యసభ నూతన స్టాండింగ్ కమిటీల నియామకంలో తెలుగు ఎంపీలకు చోటు దక్కింది. రాజ్యసభ కమిటీల ఏర్పాటుపై ఈ నెల 2న రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధన్కర్‌ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రాజ్యసభ నూతన స్టాండింగ్ కమిటీలను జగధీప్ ధన్కర్ ప్రకటించారు. తొమ్మిది కమిటీల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలకు చోటుదక్కింది. బిజినెస్ అడ్వైజరీ కమిటీ, ఎథిక్స్ కమిటీల్లో విజయ సాయి రెడ్డి(వైసీపీ), కే. కేశవరావు (టీఆర్ఎస్)లకు చోటు కల్పించారు. కాగా.. కమిటీ ఆన్ రూల్స్‌లో డాక్టర్‌ కే లక్ష్మణ్(బీజేపీ), కమిటీ ఆన్ ప్రివిలైజెస్‌లో జీవీఎల్ నర్సింహారావు(బీజేపీ), కమిటీ ఆన్ సబార్డినేట్ లెజిస్లేషన్‌లో కేఆర్ సురేశ్ రెడ్డి (టీఆర్ఎస్)లకు చోటు దక్కింది ఇక పోతే.. హౌజ్ కమిటీకి చైర్మన్‌గా సీఎం రమేశ్(బీజేపీ), హౌజ్ కమిటీ సభ్యుడిగా బడుగుల లింగయ్య(టీఆర్ఎస్)కు స్థానం దక్కించుకున్నారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Gold Rates | రూ. లక్ష మార్క్ చేరుకోనున్న బంగారం ధర!!

దేశంలో బంగారం ధరలు(Gold Rates) పరుగులు పెడుతున్నాయి. మధ్యమధ్యలో స్వల్పంగా తగ్గుతూ...

Chandrababu | కార్యకర్తల్ని ఉద్దేశించి చంద్రబాబు ఎమోషనల్ స్పీచ్

టీడీపీ అభిమానులు పార్టీ ఆవిర్భావ వేడుకలను రెండు రాష్ట్రాల్లోనూ ఘనంగా నిర్వహిస్తున్నారు....