పెళ్లి అయిన రెండు గంటలకే అబ్బాయికి షాక్  ఇచ్చిన ప్రేయసి – వీడు మాములోడు కాదు 

-

సోషల్ మీడియాలో ఈ మధ్య చాలా మందికి కొత్త పరిచయాలు పెరుగుతున్నాయి, ఈ సమయంలో ప్రేమ అనే తీపి మాట చెప్పి కొందరిని ఆ బుట్టలో పడేస్తున్నారు… ఇలాగే ఓ గేమ్ ఆడుతూ పరిచయం అయిన అమ్మాయికి వల వేశాడు ఓ వ్యక్తి.. చివరకు ఆమె అతని దగ్గరకు వచ్చింది….వెంటనే గుడికి తీసుకు వెళ్ళి ఆమెని పెళ్లి చేసుకున్నాడు… ఇక నిన్ను నన్ను ఎవరూ వేరు చేయలేరు, మనది నిజమైన ప్రేమ అని సినిమా డైలాగులు చెప్పాడు.
వీడు తోపు అనుకుంది ఆ అమ్మాయి, అయితే ఆ అబ్బాయి ఆమెతో మాట్లాడిన సమయంలో ఆమెకి అనేక విషయాలు చెప్పాడు, నేను పీజీ చేశాను, నాకు పెద్ద ఇళ్లు ఉంది, మా ఇంట్లో పది మంది పనోళ్లు ఉంటారు, బయటకు వస్తే కారు ఇంట్లోకి వస్తే ఏసీ, మా ఆస్తులు మాకే తెలియదు ఎక్కడ ఎక్కడ ఏమి ఉన్నాయో అని ఇలా కవరింగ్ ఇచ్చాడు.
ఇక ఆమె కూడా ప్రియుడి మాటలు నమ్మి వచ్చేసింది..బీహార్ జముయ్ జిల్లా సుగై గ్రామంలోని దేవాలయంలో వివాహం చేసుకుని అబ్బాయి తన ఇంటికి అమ్మాయిని తీసుకువెళ్లాడు…అది పూరి గుడిస.. ఇక తండ్రి కూలీ పని చేస్తున్నాడు, తల్లి ఇళ్లల్లో పనిచేస్తోంది అని తెలిసి ఆమె షాక్ అయింది, అన్నీ అబద్దాలు చెప్పాడు అని వెంటనే తాళి తెంపేసి అక్కడ నుంచి ఇంటికి వెళ్లిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...