Flash- యాదాద్రి ఆలయ ప్రారంభ తేదీ ఖరారు

0
58

ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరు గాంచిన యాదాద్రి ఆలయ పున: ప్రారంభ తేదీ ఖరారైంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమంతో మార్చి 28, 2022న ఆలయాన్ని ప్రారంభించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఆలయ ప్రారంభోత్సవంలో భాగంగా సుదర్శన యాగంలో 5 వేల మంది రుత్వికులు పాల్గొంటారని తెలిపారు. కాగా ఆలయ ప్రారంభానికి త్రిదండి చినజియర్ స్వామి ముహూర్తం పెట్టారు. ఈరోజు యాదాద్రిలో సీఎం కేసీఆర్ పర్యటన అనంతరం ముహూర్త పత్రికను నారసింహుని పాదాల చెంత ఉంచి పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రారంభ తేదీని ప్రకటించారు.