బోధన్ అల్లర్ల వెనక ఆ ఇద్దరు..సంచలన నిజాలు వెల్లడించిన పోలీసులు

0
57

నిజామాబాద్ జిల్లా బోధన లో నిన్న ఛత్రపతి శివాజీ  విగ్రహ ప్రతిష్టాపన విషయంలో రచ్చ జరిగిన సంగతి తెలిసిందే. రెండు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకోగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీనితో రంగంలోకి దిగిన పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగం కూడా చేశారు.

పరిస్థితులు చక్కబడడానికి బోధన్ లో 144 సెక్షన్ కూడా అమలు చేశారు.అయితే ఈ ఘటనలో పోలీసులు సంచలన నిజాలు వెల్లడించారు. బోధన్ అల్లర్ల వెనక శివసేన పార్టీకి చెందిన గోపీ, శరత్ పాత్ర ఉందని పోలీసులు తేల్చారు. ఇటీవల మున్సిపల్ కౌన్సిల్ లో శివాజీ విగ్రహం ఏర్పాటు చేయాలని తీర్మానం చేశారు.

అయితే ఎప్పుడనేదానిపై నిర్ణయం తీసుకోలేదు. అయితే శివాజీ విగ్రహాన్ని రాత్రికిరాత్రి పెట్టేందుకు ఈ ఇద్దరి ప్రమేయం ఉందని వారు ప్రస్తుతం పరారీలో ఉన్నారని వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని అడిషనల్ డీజీ నాగిరెడ్డి వెల్లడించారు.