వైద్యరంగంలో ముగ్గురికి నోబెల్ – వీరు చేసిన గొప్ప పని ఇదే

-

ప్రపంచంలో ఎంతో పేరు ప్రాముఖ్యత ఉంది నోబెల్ పురస్కారానికి, మరి ఈ ఏడాది వైద్యరంగంలో ముగ్గురు దిగ్గజాలకు ఈ పురస్కారం ప్రకటించింది కమిటీ..వైద్య రంగంలో 2020కి సంబంధించి నోబెల్ పురస్కారాన్ని నోబెల్ కమిటీ ప్రకటించడంతో ప్రపంచ వ్యాప్తంగా వారి గురించే చర్చించుకుంటున్నారు అందరూ.

- Advertisement -

ఈసారి అవార్డు ఇద్దరు అమెరికన్ సైంటిస్టులు, ఒక బ్రిటీష్ శాస్త్రవేత్తకు సంయుక్తంగా ఈ ప్రతిష్టాత్మక అవార్డు ప్రకటించారు..అమెరికాకు చెందిన హార్వే జే. ఆల్టర్, చార్లెస్ ఎం.రైస్, బ్రిటీష్కు చెందిన హైకేల్ హోటాన్లు నోబెల్ పురస్కారానికి ఎంపికయినట్లు నోబెల్ కమిటీ అధికారికంగా ప్రకటించింది.

అయితే వీరు ఎంతో గొప్ప వ్యక్తులు, ఎంతో కష్టపడిన వారు, హెపటైటిస్ సి వైరస్ను కనిపెట్టినందుకు గాను ఈ అవార్డును అందజేయనున్నట్లు తెలిపింది.ఈ ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ ప్రైజ్ మనీని సమానంగా అందజేయనున్నారు.

హైపటైటిస్ ఈ వ్యాధి ప్రపంచాన్ని వణికిస్తోంది,, ఇది మనిషి కాలేయానికి సంబంధించిన వ్యాధి .. వీరు కనుగొన్న మందుల ద్వారా చాలా మంది కోలుకుంటున్నారు. ఈ ఏడాది ఈ అవార్డు వీరికి అందివ్వనున్నారు… ప్రఖ్యాత స్వీడిష్ శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరు మీదుగా ప్రతి ఏటా నోబెల్ పురస్కారాలను అందజేయడం ఆనవాయితీగా వస్తోంది. 1895 నాటి ఆల్ఫ్రెడ్ నోబెల్ వీలునామా ప్రకారం.. ఆయన మరణించిన ఐదేళ్ల తర్వాత నోబెల్ పురస్కారాలను ప్రారంభించారు.

భౌతిక శాస్త్రం,
రసాయన శాస్త్రం,
వైద్యశాస్త్రం,
సాహిత్యం,
ప్రపంచ శాంతి కి నోబెల్ పురస్కారం ఇస్తున్నారు,
అలాగే అర్ధశాస్త్రంలోనూ పురస్కారం అందజేస్తున్నారు. స్వీడన్ రాజధాని స్టాక్ హోంలో ప్రధానం చేస్తారు ఈ అవార్డు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

రేవంత్ రెడ్డికి హరీష్ రావు ఛాలెంజ్..

మూసీ ప్రక్షాళన ప్రాజెక్ట్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి...

హర్మన్ ప్రీత్‌కు టీమిండియా పగ్గాలు..

న్యూజిలాండ్‌(New Zealand)తో వన్డే సిరీస్‌కు భారత మహిళల జట్టు సన్నద్ధమవుతోంది. ఇప్పటికే...