పైకి ఫిజియో ధెరపీ సెంటర్ లోపల చీకటి వ్యాపారం

-

ఎక్కడో ఊరి అవతల జరిగే వ్యభిచారం ఇప్పుడు కాపురాలు చేసుకునే ఇళ్ల మధ్య కొందరు గుట్టుచప్పుడు కాకుండా చేస్తున్నారు.. కొందరు మసాజ్ సెంటర్ల పేరుతో కూడా వీటిని నడుపుతున్నారు.. వ్యభిచార ముఠాలు ఏదో ఒక పేరుతో తమ వ్యాపారాన్ని విస్తరిస్తూనే ఉన్నాయి.

- Advertisement -

స్పా సెంటర్లు, ఫిజియోథెరపీ సెంటర్లు పేరుతో యాపారం చేస్తున్నారు కొందరు ముఠాసభ్యులు..తాజాగా హైదరాబాద్ లో ఇలాంటి ముఠా అడ్డంగా దొరికింది.. మెహిదీపట్నంలోని ఓ మసాజ్ సెంటర్ లో మెహరాజున్నీసాఅనే మహిళ రిసెప్షనిస్టుగా పని చేసింది.
ఇటీవల దానిని యజమాని అమ్మేశారు, దీంతో తానే దానిని టేకోవర్ చేసుకుంది.

మసాజ్ ముసుగులో వ్యబిచారం నిర్వహించటం ప్రారంభించింది. తాజాగా ఇక్కడ నుంచి ఏసీ గార్డ్స్ కు మకాం మార్చింది.ఫిజియో థెరపీ సెంటర్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నారని పోలీసులకు తెలిసింది… దీంతో పోలీసులు అక్కడ చూస్తే వీరి బండారం బయటపడింది.

మసాజ్ సెంటర్ నిర్వాహకురాలితో పాటు నలుగురు విటులు, ఇద్దరు యువతులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలాంటి కార్యకలాపాలు ఎక్కడైనా జరిగితే కచ్చితంగా స్ధానిక పోలీస్ స్టేషన్ కు తెలియచేయాలి అని ప్రజలకు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

PM Modi | పాక్‌తో ఎప్పుడూ నమ్మకద్రోహమే: మోదీ

భారత్, పాకిస్థాన్ మధ్య సత్సంబంధాలు ఏర్పడవా, శాంతి నెలకొనదా, ఈ దేశాల...

MLC Kavitha | 13 వేల మంది ఇన్‌వ్యాలిడ్‌ ఎలా అయ్యారు: కవిత

గ్రూప్-1 పరీక్షల ఫలితాలపై ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. వీటిలో తెలుగు...