వాటన్నింటికి చెక్ పెట్టిన రతన్ టాటా

వాటన్నింటికి చెక్ పెట్టిన రతన్ టాటా

0
69

సామాన్యుల నుంచి ప్రముఖులు, సెలబ్రెటీల దాక సోషల్ మీడియాలో నకిలీ వార్తల బెడద పట్టి పీడిస్తునే ఉంటుంది… ముఖ్యంగా కరోనా విస్తరిస్తున్న వేళ నకిలీ వార్తలు మరింత ఎక్కువ అయ్యాయి..

తాజాగా ప్రముఖ పారిశ్రామిక వేత్త టాటా ట్రస్ట్ చైర్మన్ రతన్ టాటా కూడా ఫేక్ న్యూస్ బారీన పడ్డాడు… దీంతో స్వయంగా ఆయనే ట్వీట్టర్ ద్వారా స్పందించారు… దేశ అర్థిక వ్యవస్థ గురించి తాను చెప్పినట్లు ఇటీవలే సోషల్ మీడియాలో వార్తలు వచ్చాని అందులో ఎలాంటి వాస్తవం లేదని అన్నారు…

వాట్సప్ సహా ఇతన సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త పట్ల నిజ నిజాలు తెలుసుసుకోవాలని అన్నారు… ఏదైనా అంశం చెప్పదలచుకుంటే తాను స్వయంగా ప్రకటిస్తానని తెలిపారు…