విజయసాయి రెడ్డి వారికి స్ట్రాంగ్ వార్నింగ్

విజయసాయి రెడ్డి వారికి స్ట్రాంగ్ వార్నింగ్

0
68

ఏపీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఆ పార్టీ ఎమ్మెల్యేలకు మంత్రులుకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు… ఎవరైనా పార్టీ గీత దాటితే సహించేది లేదని విజయసాయిరెడ్డి హెచ్చరించారు…

తాజాగా ఆయన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… ఏమైనా సమస్యలు ఉంటే పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి దగ్గర చెప్పాలి అన్నారు ఇలా మీడియా ముందు తీసుకు వస్తే సహించేదిలేదని విజయసాయి రెడ్డి వార్నింగ్ ఇచ్చారు…

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని అన్నారు… ఎంతటి వారు అయినా సరే పార్టీ గీత దాటితు చర్యలు తప్పవని అన్నారు… కాగా నెల్లూరు జిల్లాలో అధికార పార్టీనాలకు రెండు వర్గాలుగా విడిపోయిన సంగతి తెలిసిందే… ఈ క్రమంలో ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి మీడియా సాక్షింగా సంచలన వ్యాఖ్యాలు చేశారు… స్వచ్చమైన తేనె కావాలంటే వెంటగిరికి రండి…

ఏ ఇతర మాఫియా కావాలన్నా నెల్లూరు నగరానికి వెళ్లండని అంటూ నెల్లూరు జిల్లాలో ప్రాతినిత్యం వహిస్తున్నా అనిల్ అలాగే శ్రీధర్ రెడ్డిలని ఉద్దేశిస్తూ పరోక్షంగా వ్యాఖ్యానించారు. దీంతో వైసీపీ వర్గ విభేదాలు భహిర్గతం అయ్యాయి… దీనిపై విజయసాయి రెడ్డి స్పందించారు….