పవన్ పై విజయసాయిరెడ్డి పంచ్ అదిరింది…

పవన్ పై విజయసాయిరెడ్డి పంచ్ అదిరింది...

0
139

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పంచులు వేశారు… ఇటీవలే పవన్ తెలుగు బాషను ప్రస్తావిస్తూ వైసీపీపై విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే…

ఇక తాజాగా ఆయన ఢిల్లీ టూర్ కు చేశారు… ఆ టూర్ పై విజయసాయిరెడ్డి కొన్ని విమర్శలు చేశారు… ఈ మేరకు ట్వీట్ కూడా చేశారు… భగత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడని, జాతీయ జెండా రూపకర్త నెహ్రూ, స్వాతంత్రం 1940లో వచ్చిందని చెప్పి అజ్ణానాన్ని బయట పెట్టుకున్న ‘నిత్యకళ్యాణం ఢిల్లీ వెళ్లి ఏ భాషలో మాట్లాడుతున్నాడో అని విజయసాయిరెడ్డి విమర్శలు చేశారు…

హిందీ, ఇంగ్లీష్ రాకుంటే అక్కడ హోటల్ లో భోజనం కూడా ఆర్డర్ ఇచ్చుకోలేం అని విజయసాయిరెడ్డి అన్నారు. మరి దీనిపై పవన్ ఎలా స్పందిస్తారో చూడాలి…