Flash: ఏపీలో డిపార్ట్ మెంటల్ పరీక్షలపై ఏపీపీఎస్సీ కీలక ప్రకటన

0
185
College students studying together in a library

ఏపీలో డిపార్ట్ మెంటల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ వెల్లడించింది. గ్రామ, వార్డ్ సచివాలయాల్లో పని చేస్తున్న అభ్యర్థులకు ఈనెల 26 నుంచి డిపార్ట్ మెంటల్ టెస్టులు జరగడానికి అన్ని సన్నాహాలు చేసినట్టు తెలిపారు. ఉమ్మడి 13 జిల్లాల కేంద్రాల్లో వీటిని నిర్వహించనున్నారు.  మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లు, గ్రేడ్ 2 ANMలు, గ్రేడ్3 ఉద్యోగులకు సిద్ధంగా ఉండాలని తెలిపారు. నేటి నుంచి హాల్‌‌టి‌కెట్లు అందు‌బా‌టులో ఉంటా‌యని, వీటి కోసం అభ్య‌ర్థులు అధికారిక వెబ్ సైట్ లో డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.