బై బై గణేశా..గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ గణనాథుడు

0
63

ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం అట్టహాసంగా ముగిసింది. ఏటా 40 టన్నుల బరువులోపే ఉండే మహా గణపతి.. మట్టితో తయారు చేయడం వల్ల ఈసారి 70 టన్నులకు చేరింది. భారీ వాహనంపై ఊరేగింపుగా వచ్చి ఎన్టీఆర్ మార్గ్ క్రేన్ నంబర్ 4 వద్ద ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జనం చేశారు. మహా గణపతి ప్రశాంతంగా గంగమ్మ ఒడికి చేరింది. భక్తులు బై..బై గణేశా  అంటూ సాగనంపారు.