మనలో చాలా మంది రాత్రి పడుకునే సమయంలో కచ్చితంగా సెల్ ఫోన్ చార్జింగ్ పెట్టి పడుకుంటాం, అయితే కొందరు మాత్రం ఇలా చార్జ్ పెట్టి పడుకోరు, అది పూర్తి ఛార్జ్ అయ్యాక సాకెట్ నుంచి చార్జ్ తీస్తారు, అయితే ఇలా ఉంచితే ఓవర్ చార్జ్ అయి ఫోన్ పేలిపోతుంది మంటలు వస్తాయి అని చెబుతారు.. కాని నిపుణులు దీనిపైఏమి అంటున్నారు అంటే.
బ్యాటరీ ఎప్పటికీ ఓవర్ఛార్జింగ్ కాదు… బ్యాటరీలను డిజైన్ చేసే నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒకసారి 100శాతం ఛార్జ్ అయ్యాక ఎలక్ట్రికల్ ఛార్జింగ్ నిలిపే విధంగా ఫోన్లలో నిర్వహణ వ్యవస్థ ఉంటుంది. అలా ఉండటం వల్ల బ్యాటరీ ఎప్పుడూ ఓవర్ చార్జ్ అనేది అవ్వదు.
కానీ 100శాతం ఛార్జింగ్ పెట్టడం వల్ల బ్యాటరీ మీద ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. ఈ కారణం వల్లే ఎలక్ట్రిక్ వాహన తయారీదారులు కొత్త బ్యాటరీలను 80శాతం వరకే ఛార్జింగ్ చేస్తారు. సో దాదాపు 90 శాతం వరకూ చార్జ్ పెట్టుకుంటే మంచిది, వందకి వంద పెట్టుకుంటే ఓవర్ హీట్ అవుతుంది, అలాగే ఒత్తిడి పెరుగుతుంది.