పెళ్లి అయిన 10 గంటల్లో పెళ్లికూతురిపై రేప్ తర్వాత ఏం జరిగిందంటే

పెళ్లి అయిన 10 గంటల్లో పెళ్లికూతురిపై రేప్ తర్వాత ఏం జరిగిందంటే

0
45

మహిళలకు దేశంలో రక్షణ లేకుండా పోయింది.. అత్యాచారం కేసులు కూడా పెరిగిపోతున్నాయి, మహిళలపై ఇలాంటి దారుణాలు చేసేవారు మరింత పెరిగిపోతున్నారు.. దిశ ఘటన నిర్భయ ఘటన తర్వాత మార్పు వస్తుంది అని అనుకున్నా ఎలాంటి మార్పు కనిపించడం లేదు.

తాజాగా ఉత్తర ప్రదేశ్ లో అప్పుడే పెళ్లైన నవ వధువుపై దారుణానికి ఒడిగట్టారు కొందరు కీచకులు. పెళ్ళైన మర్నాడే ఆమెపై లైంగిక దాడి జరిపారు. దీంతో ఈ ఘటన షాక్ కు గురి చేసింది..హాపూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.
ఠానా దేహాట్ ప్రాంతానికి చెందిన యువతికి జనవరి 17న ఓ యువకుడితో వివాహమైంది.

తర్వాత ఆమెని వెంటనే అత్తగారి ఇంటికి పంపించారు.. ఆ సమయంలో ఆమె అత్తగారింట్లో అడుగు పెట్టిన కొన్ని గంటలకు కనిపిచంలేదు. దీంతో భర్త కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు.. వెంటనే పోలీసులకి కంప్లైట్ ఇచ్చారు, తర్వాత రోజు ఉదయం ఆయువతి హాపూర్లోని ఓ బ్యాంకు సమీపంలో అపస్మారక స్థితిలో పడి ఉండగా కనుగొన్నారు. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

అయితే ఆమెని ఇంటి నుంచి కొందరు కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారు అని చెప్పింది.. తనపై సామూహిక లైంగిక దాడి చేశారు అని చెప్పింది, తనని బైక్ పై ఇద్దరు యువకులు తీసుకువెళ్లారు అని ఆమె కన్నీరు పెట్టుకుంది. వారు ఎవరు అనేదానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.