యాదాద్రిలో అద్భుతఘట్టానికి అంకురార్పణ

0
45

అదిగో భువనగిరి..అదిగదిగో రాయగిరి..ఆ రెండింటినీ తలదన్నేలా కనిపిస్తున్నది సూడు అదే యాదాద్రి పుణ్యక్షేత్రం. ఐదు రూపాల్లో స్వామి దర్శనమిచ్చే ప్రాంతం కావడంతో పంచ నారసింహ క్షేత్రంగా యాదాద్రి ప్రసిద్ధి చెందింది. ఏడేళ్ల క్రితం చేపట్టిన ఘనమైన దీక్ష నేడు కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది.

మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా పంచకుండాత్మక మహాయాగానికి రుత్వికులు శ్రీకారం చుట్టారు. నేటి నుంచి ఈనెల 28 వరకు యజ్ఞయాగాదులతో యాదాద్రి మార్మోగనుంది. ఆగమశాస్త్రానుసారం పంచకుండాత్మక మహాయాగానికి అంకురార్పణ జరిపారు.

సాయంత్రం మృత్సగ్రహణం, అంకురార్పణ, యాగశాల ప్రవేశం, కుంభస్థాపన, అష్టదిక్పాలకుల ప్రతిష్టాపన పర్వం ఉంటుంది. ప్రస్తుతం బాలాలయంలో అష్టోత్తర శతఘటాభిషేక మహారాజాభిషేకం నిర్వహిస్తున్నారు.