T20 :మేము భారత్‌ను ఓడించటానికి వచ్చాం: బంగ్లా కెప్టెన్‌

-

T20: టీ20 ప్రపంచ కప్‌ మ్యాచ్‌లో ఊహించని పరిమాణాలు చోటుచేసుకుంటున్నాయి. చిన్న జట్టే కదా చిన్నచూపు చూసిన జట్లు.. పెద్ద జట్లను కుమ్మేస్తున్నాయి. ఇక సెమస్‌ బెర్తుల కోసం రెండు గ్రూపుల్లో గట్టి పోటీ ఉంది. గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో కొనసాగేందుకు ఎంత శ్రమిస్తున్నాయో.. అంతకంటే ఎక్కువుగా వరుణుడు కూడా కష్టపడుతున్నాడేమో అనిపిస్తోంది ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే. ఇప్పటికే నాలుగు మ్యాచులు వర్షార్పణం అయిన సంగతి తెలిసిందే. బుధవారం భారత్‌- బంగ్లాదేశ్‌ జట్లు అడిలైడ్‌ వేదికగా తలపడనున్నాయి.

- Advertisement -

అయితే, బుధవారం అక్కడ వర్షం పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ నిపుణులు హెచ్చరించారు. దీంతో T20 అభిమానులు ఆందోళన చెందుతున్నారు. భారత్‌-బంగ్లా మ్యాచ్‌ నేపథ్యంలో బంగ్లాదేశ్‌ జట్టు సారథి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. తాము ప్రపంచ కప్‌ గెలిచేందుకు రాలేదనీ.. ఇండియాను ఓడించేందుకే వచ్చామని బంగ్లా కెప్టెన్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ అన్నాడు. ప్రపంచ కప్‌ గెలవటానికి భారత్‌ ఇక్కడకు వచ్చిందనీ.. మేము కప్‌ గెలిచేందుకు ఇక్కడికి రాలేదు.. మేం టీమిండియాను ఓడిస్తే.. ఆజట్టు కలత చెందుతుందని మాకు తెలుసు. అదే మా లక్ష్యం అని అన్నాడు. మరి రేపు భారత్‌-బంగ్లా తడపడతాయో.. రెండు జట్లతో వరుణుడు ఆడుకుంటాడో వేచి చూడాలి.

Read also: Pawan Kalyan: ప్రజలంతా నిత్య చైతన్యమూర్తులై పోరాడాలి

Read more RELATED
Recommended to you

Latest news

Must read

వైసీపీ హయాంలో అభివృద్ధి శూన్యం.. ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు..

వైసీపీ ప్రభుత్వంలో అవినీతి ఫుల్ స్పీడ్‌లో ఉండగా, అభివృద్ధికి బ్రేక్ పడిందని...

జగన్‌ పాలనపై రేణుకాచౌదరి తీవ్ర విమర్శలు

ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు, రాజ్యసభ...